నవతెలంగాణ-పిట్లం రైతుల శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శనివారం మండలంలోని బండాపల్లి గ్రామంలో పట్టాపా స్పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. రైతు లకు ఎకరానికి రూ.8వేల నుంచి రూ.10వేలకు పెట్టు బడిసాయాన్ని పెంచిందన్నారు. రైతుల కుటుంబాలు రోడ్డుపాలు కావద్దనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. నియోజకవర్గంలోని పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాలకు చెందిన రైతుల కోసం నిజాంసాగర్లో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలో ఈ మత్తడి నిర్మాణం పూర్తి చేసి రైతుల పంట లను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతరం పలు వురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారి కి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ రజినీకాంత్రెడ్డి, జడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూపతిరెడ్డి, కంట్రోత్ రవీందర్నాయక్, తదితరులు పాల్గొన్నారు.