మద్నూర్ : పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హన్మం త్షిండేను శనివారం మండల కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పీఆర్ టీయూ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖుషాల్ హాజరుకాగా ఆయన్ను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలోనే తానూ చదివానని గుర్తుచేశారు. ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని వదులుకొని రాజకీ యాల్లోకి వచ్చానని తెలిపారు. జుక్కల్ ప్రజలు తనకు గౌరవించి మూడుసార్లు హ్యాట్రిక్ సాధించడానికి సహ కరించి భారీ మేజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మద్నూర్ మండలంలో విద్యా శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. మారు మూల మండలమైన మద్నూర్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి చదువు అందించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఆర్టీయూ నాయ కులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.