- మండల వ్యవసాయాధికారి శ్రావణ్ కుమార్ నవతెలంగాణ-బీర్కూర్ ఫసల్బీమా పథకం రైతులకు ధీమాగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి శ్రావణ్కుమార్ అన్నారు. శనివారం బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో యాసంగి పంటలపై, ఫసల్బీమా యోజన పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతి రైతుకూ వరిపంట ఎకరానికి రూ.450 చొప్పున ప్రీమియానికి బ్యాంక్ ద్వారా నెఫ్ట్ విధానం ద్వారా చెల్లించాలని, ఈ బీమా సౌకర్యం డిసెంబర్ 31వరకు ముగుస్తుందని తెలిపారు. అనంతరం ప్రీమియం బ్యాంకు లో చెల్లించిన రైతులకు దరఖాస్తు పత్రాలను అంద జేశా రు. కార్యక్రమంలో యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెం ట్ చవాన్ రూప్సింగ్, రైతులు సయ్యద్ ముఖ్తర్, ధూళిగ కిషన్, కుటుంబరావు, ఆదినారాయణమూర్తి, ఇంగు రా ములు, కుర్మ బుచ్చుగొండ, హన్ముగొండ, గుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.