నవతెలంగాణ-బీర్కూర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మత్య్స సహకార సం ఘం అధ్యక్షుడు పల్లికొండ సాయిబాబాను టీఆర్ఎస్ నుం చి బహిష్కరిస్తున్నట్టు మండలాధ్యక్షులు రఘు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మత్య్స శాఖ సహకార సంఘం అధ్యక్షుడు, తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ నాగమణి భర్త అయిన సాయిబాబాను బహిష్క రించేందుకు టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాయిబాబా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రజా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారని తీర్మా నంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, హన్మంతు, పడితే నారాయణ, లాయక్, రామకృష్ణగౌడ్, సాయిలు, నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.