నవతెలంగాణ-వర్ని మండలంలోని ఘన్పూర్ గ్రామ బీసీ, ఎస్టీ కాల నీలో వారం రోజుల నుంచి తాగునీరు రాక కాలనీ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంక్ పైపు పగిలి నీరు రాకపోయినా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. దీంతో పక్కనఉన్న మందిరం బోర్ మోటర్ నీళ్లు వాడుకుంటున్నామన్నారు. పొద్దున కూలికి వెళ్లే మహిళలకు కష్టాలు ఎదురవు తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లప్పుడు గొప్పలు చెబుతారు, ఇప్పుడు నాయకులకు కష్టాలు కనిపించవా అని మండి పడ్డారు. పంచాయతీలో కార్యదర్శి ఉండరని, పగిలిన పైపులకు మరమ్మతులు చేయరని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.