- జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మెంబర్ రాములుకు టీయూ స్కాలర్స్ వినతి
నవతెలంగాణ-డిచ్పల్లి
కేంద్ర మానవవనరుల శాఖ 'రాజీవ్ గాంధీ జాతీయ ఫెలోషిప్', మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్'పై నూతనంగా తీసుకొచ్చిన మార్గ దర్శకాల ప్రకారం వెనుకబడిన వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని టీయూ స్కాలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జాతీయ షెడ్యూలు కులాల కమిషన్ మెంబర్ కె.రాములుకు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమర్ ఆధ్వర్యంలో టీయూ స్కాలర్ సత్యం సట్లపల్లి, ఓయూ స్కాలర్స్తో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇప్పటికే నాన్నెట్ ఫెలోషిప్ లు లేక యూని వర్సిటీలో పరిశోధనలు వెనుకబడి పోతున్నాయన్నారు. తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారిచ్చిన వినతి పత్రంలో కోరారు. ఇదివరకే వెనుకబడిన వర్గాలను మరింత వెనుకకు నెట్టే విధంగా ఉందని వారు దుయ్యబట్టారు. ఇది వరకే ఎస్టీ, ఓబీసీ ఫెలోషిప్లకు ఎటువంటి అర్హతలు పెట్టకుండా నే అప్లికేషన్స్ తీసుకున్నారని, షెడ్యూల్డ్ కులాలు, మైనారిటీ వర్గాల విద్యార్థులకు మాత్రం కొత్తగా 'యూజీసీ జాతీయ అర్హత పరీక్ష' పెట్టార న్నారు.
ఇలా పెట్టడం ఎంత వరకు సమంజ సమని వారు ప్రశ్నించారు. ఇప్పుడిప్పుడే ఉన్నత విద్య వైపు ఆయా వర్గాల నుంచి వస్తున్న విద్యార్థు లను అడ్డుకునే విధంగా ఈ చర్యలు ఉన్నాయని, దీన్ని వెంటనే యూజీసీ మార్గదర్శకాలు వెనక్కి తీసుకునేలా కమిషన్ చర్యలు తీసుకోవాల న్నారు. ఈ మేరకు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మెంబర్ కే.రాములుకు వివరించారు. కార్యక్ర మంలో ఫ్రొఫె˜సర్ పంతుకల శ్రీనివాస్, బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజరు, ఓయూ పరిశోధక విద్యార్థులు తదితరులు ఉన్నారు.
Authorization