నవతెలంగాణ-వర్ని
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమై న ఓటింగ్ ఉన్నప్పటికీ శాసనసభ ఎన్నికల్లో జరిగిన పరా జయం వారిని కృంగదీస్తుంది. నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే నాయకులు లేకపోవడంతో కాం గ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు పలువురు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. జోష్లో ఉన్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో వీలైనన్ని పంచాయతీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పక్కా ప్రణా ళికతో కదులుతోంది. పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోవడానికి గ్రామాల్లో పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా టీఆర్ఎస్ కలుస్తున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఐదేండ్ల వరకూ వేచి ఉండడం కంటే ప్రభుత్వంతో కలిసి పోతేనే పనులు జరుగుతాయని పలువురు కాం గ్రెస్ నా య కులు టీఆర్ ఎస్లో చేరడా నికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీలు ఏకగ్రీవం చేసు కోవడం వలన గ్రామానికి నజరనా వస్తుందని చెబుతూ గులాబీ పార్టీ అడుగులు వేస్తుంది. ప్రజలకు అవసరం అయిన రోడ్లు, డ్రయినేజీ, పారిశుద్ధ్యం, తాగునీటితో పాటు తదితర అభివృద్ధి పనులు తక్షణ మే తీర్చుకోవచ్చని ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నారు. మొత్తాని కి టీఆర్ఎస్ గమ్యం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తొలిసారి తండా లు పంచాయతీలుగా ఎన్నికల బరిలో వస్తున్నాయి. ఈ ఘనత టీఆర్ఎస్ దేనని పార్టీ శ్రేణులు సెంటిమెంట్తో అన్ని స్థానాలను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. నూతన పంచాయతీల్లో పోటీచేసే అభ్య ర్థులు కూడా అధికార పార్టీ సర్పంచ్ నిలబడితే గెలుపు ఖాయమని భావిస్తు న్నారు. అభివృద్ధి పనులు కూడా గ్రామా ల్లో చేయవచ్చని అందుకు ఎమ్మెల్యే అండదండలు కూడా ఉంటాయని ఆలో చిస్తున్నారు.
Authorization