అ కొత్త పంచాయతీల్లో ఏర్పాట్లు
అ ఆశావహులకు
నచ్చజెప్పుతున్న నాయకులు
అ ఇప్పటికే పూర్తయిన చర్చలు..?
నవతెలంగాణ-డిచ్పల్లి
నాడు తమ గిరిజన తండాలు గ్రామ పంచా యతీ అయితే తాము పోటీచేస్తామని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆశావహులకు నిరాశే మిగలనుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు పలు గిరిజన తండాలు, గూడాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఏ విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు చేపడుతూ వేలం పాటలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏకగ్రీవ గ్రామపంచాయతీలు చేస్తే ప్రభుత్వం నుంచి ఆ గ్రామ పంచాయతీలకు నజరానా రూ.లక్షలు వస్తాయని, ఆశావహులందరినీ ఒక చోటకు చేర్చి వారు తండాలకు ఏమి చేస్తారు. మాకెంత ఇస్తారనే పాటలు, మాటాలు నడుస్తున్నట్లు తెలియవచ్చింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎవరూ బయటికి చెప్పకుండా నియంత్రించుకుం టున్నారు. ఎన్నో ఏండ్లుగా గిరిజన గూడాలను గ్రామ పంచా యతీలుగా చేస్తామని ఊరిస్తూ వచ్చారు.
గత కొన్నెండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట, హామీ ప్రకారం మూడు వందల నుంచి, ఐదు వందలకు పైగా జనాభా కలిగిన గిరిజన గూడా లను గ్రామపంచాయతీలుగా చేసింది. ఆ నాటి నుంచి నేటి వరకూ గిరిజన తండాల్లో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని యువకులు, తండావాసులు, ఆశావహులు ఎదురు చూశారు. ఎట్టకేలకు పంచా యతీ నగార మోగింది. హైకోర్టు జోక్యంతో ఎన్ని కలకు చకచక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం బీసీ గణన పూర్తయి మండలాల వారిగా, కులాల వారిగా రిజర్వేషన్లను ఇప్పటికే అధికారికం గా, అధికారులు ప్రకటించారు. రూరల్ నియోజక వర్గంలో మొత్తం 172 గ్రామ పంచాయతీలు న్నాయి. దీనిలో నూతనంగా 44 గ్రామ పంచా యతీలను ఎస్టీలుగా ప్రకటించారు. ఇదే కాకుండా నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పాత గ్రామ పంచాయతీలో 10 ఎస్టీ గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు. మొత్తం 54 గిరిజన గ్రామ పంచా యతీలుగా నియోజకవర్గంలో ప్రకటించారు. దీనిలో 118 గ్రామ పంచాయతీల్లో ఎస్సీలు, బీసీలు, జనరల్ వారీగా స్త్రీ ,పురుష నిష్పత్తిలో ప్రకటిం చారు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో ఈ రిజర్వేషన్ వచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికా రికంగా వెలువడకున్నా తమకు విశ్వసనీయంగా సమాచారముందని, వాట్సప్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏ గ్రామంలో అయినా అక్కడ ఉన్న జనాభాకనుగుణంగా రిజర్వేషన్ల ప్రకారం ఇప్పటికే నివేదికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులు ఇక గ్రామాలు, వార్డుల రిజర్వేషన్ల అంశం ప్రకటించాల్సి ఉంది. రిజర్వేషన్లు ఖరారు కాక ముందే పోటీచేసే ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో గతంలో లాగే ఈసారి ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాకపోవచ్చని పలువురు పేర్కొం టున్నారు. గతంలో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారంతో ఆనాడు కొన్ని నెలల ముందుగానే ఆశావాహులు తమ తమ పలుకుబడిని ఉపయోగించుకోని కుల సంఘాల నాయకులు విందులు, వినోదాలు ఇచ్చుకుంటూ నెలల తరబడి డబ్బులను ఖర్చులు పెట్టుకున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి హైకోర్టు జోక్యంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశాలతో ఒక్కసారిగా గ్రామాల్లో ఎన్నికలపై గ్రామ రాజకీయ వేడి ఒక్కసారిగా వేడెక్కింది. ఇది గ్రామా ల్లోని పరిస్థితి ఇలా ఉంటే గిరిజన గ్రామ పంచాయతీల తీరు మరోల ఉంది. గిరిజన గ్రామ పంచాయతీల్లో మాత్రం గత కొన్ని నెలల నుంచి బేరసారాలు మొదలైన మధ్యలో ఆగిపోయింది. ఈసారి మాత్రం కచ్చితంగా ఎన్నికలు జరుగుతుండడంతో దేనికైనా తాము సిద్ధమనే విధంగా కొనసాగుతుందని వినికిడి. ఉమ్మడి జిల్లాలో ఈ సారి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. నిజామబాద్ జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. కామా రెడ్డి జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయితీలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,056 గ్రామ పంచా యతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నూతనం గా 151 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో నూతనంగా 214 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గతంలో ఓడిపోయిన వారు, తాజా మాజీ సర్పంచ్లుగా చేసిన వారు ఈ సారి తమకు రాకున్నా, తమ భార్యలు, కూతుళ్లు,కుమారులను పోటీలో నిలుపడానికి ఉవ్విళ్లూరుతున్నారు. గ్రామాల్లో సర్పంచ్గా గెలిచిన వెంటనే గ్రామాలను వదిలి పట్టణాల్లో ఉండేవారు. కొందరు తమ మకాన్ని గ్రామాలకు మార్చుకున్నారు. అందరితో మమేకమై ఈ సారి తనను ఆశీర్వాదించాలని వేడుకుం టున్నారు. గిరిజన తండాల్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గతంతో పోల్చుకుంటే గిరిజన తండాల్లో యువకుల్లో చైతన్యం పెరగడంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో యువకులే పోటీల్లో ఉండే అవకాశం ఉంది. గతంలో తండాల నుంచి ప్రాతినిథ్యం వహించిన వారు తమ గూడాలను పట్టించుకోలేకే తండాలు అభివద్ధి చెందలేదని, ఈసారి మాత్రం వారికి పోటీకి దూరంగానే ఉంచా లనే నిర్ణయాలకు వచ్చారు. కానీ తండాల్లో కుల పెద్దలు చేప్పిందే వేదం. వారు ఎవరు పోటిలో నిలువాలంటే వారే నిలవాలి. లేదంటే ఏమి లేదు. నూతన గ్రామ పంచాయతీలో మొట్ట మొదటి సర్పంచ్ అయి రికార్డు సష్టిద్దామనే ఆలోచన చేసిన వారు పెద్దల ఆదేశాలతో ఏం చెయ్యలో అర్థం కాకుండా ఉండి పోయారు. కానీ తమకు ఆ అవకాశం రాకుండాపోయిందని వారు భావిస్తున్నారు. దేనికైనా తాము సిద్దం అనే సంకేతలు ఇస్తున్నారు. కానీ కొన్ని గిరిజన తండాల్లో మాత్రం తమ పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరికీ డబ్బు లిచ్చేది లేదని, స్వయాన పోటీలోనే ఉంటామని పోటిలోనే తేల్చుకుందమని మరి కోందరు తండా పెద్దలతో మంతనలు చేస్తున్నట్లు ఆశావహులు తేల్చి చెబుతున్నారు. వార్డ్ మెంబర్ నుంచి మొదలుకుని సర్పంచ్ వరకూ డబ్బులు లేనిదే ఈ ఎన్నికల్లో మాత్రం గెలవడం అంత సులువు కాదు. కొందరు ఆశావహులకు పదో తరగతి చదువుకుని ఉండాలని, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దనే నిబంధనలు కొందరు ఆశా వహులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం నూతనంగా చేసిన గ్రామ పంచాయతీలకు ఈసారి ఎక్కువ సంఖ్యలో నిధులు కేటాయిస్తుందని ఆశ ఇంకొందరిలో లేకపోలేదు. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, బీఆర్జీఎఫ్, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్నారీజీఎస్ నిధులు ఉండనే ఉన్నాయి. దీంతో తమ తమ గ్రామ పంచాయతీలను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోగలుగుతామని, వారిలో ఒక ఉత్సాహం కలుగుతోంది.
Authorization