నవతెలంగాణ-ముప్కాల్ ఈ నెల 30, 31, జనవరి 1వ తేదీలలో ఖమ్మం జిల్లాలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు ఓ.రమేశ్ తెలిపారు. శనివారం మండలంలోని బుస్సాపూర్లోని కేజీబీవీలో ఉపాధ్యాయులతో కలిసి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభలకు ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్ హాజరై ఉన్నత విద్య, పరిణామ క్రమం, 'సమాన, నాణ్యమైన విద్య - ప్రభుత్వ బాధ్యత' తదితర అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. అదే విధంగా సీపీఎస్ రద్దు, పీఆర్సీ తదితర ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. కావున ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.