నవతెలంగాణ-నిజాంసాగర్ సింగీతం రిజర్వాయర్ నీటిని గురువారం విడుదల చేశారు. మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్లోకి 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు జేఈ శివప్రసాద్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 416.55 మీటర్లకుగాను ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వవుంది. 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లోను ఒక గేటు ఎత్తి నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.