నవతెలంగాణ-మోర్తాడ్
ఫిక్స్డ్ వేతనం సాధించుకోవాలంటే పోరాటమే మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. వేల్పూర్, మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన దీక్షలను ఆమె గురువారం ప్రారంభించి మాట్లాడారు. స్వయంగా సీఎం కేసీఆర్ ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అని చెప్పి మోసం చేసి. మళ్లీ పారితోషికాలనే చెల్లిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా ఆశలకు పదివేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశాలు106 రోజులు సమ్మె చేయడంతో స్వయంగా ముఖ్యమంత్రి ఆరువేల ఫిక్స్ డ్ వేతనం చెల్లిస్తామని ప్రకటించారన్నారు. కానీ పారితోషికాలకు ముడిపెట్టారని తెలిపారు. వెంటనే ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇంద్ర, భూలక్ష్మి, శ్రీదేవి, సుజాత, కవిత, నర్సు, లలిత, రాజశ్రీ, శ్రీనిత, తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్లో శైలజ, శోభ , లావణ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్: ఆశాలకార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వెట్టి చాకిరీ పనులను ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు డిమాండ్ చేశారు. గురువారం బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశాకార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్లో సిద్ధిరాములు మాట్లాడుతూ 2018 అసెంబ్లీ రద్దుకు ముందు ఆశాకార్యకర్తలకు 7500 పారితోషికం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి అమలు చేయలేదన్నారు. పక్క రాష్ట్రంలో ఆశాకార్యకర్తలకు నెలకు 10 వేలు జీతం ఇస్తుందని తెలంగాణాలోనూ రూ.10వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదునెలల బకాయిలు వెంటనే చెల్లించాలని, లెప్రసి, ఎన్సీడి తదితర సర్వే డబ్బులు వెంటనే చెల్లించాలని, ఆశాకార్యకర్తలకు జాబ్ కార్డు ఇవ్వాలని, ఆరు జతల పెండింగ్ యూనిఫామ్స్ ఇవ్వాలని, ఆశాలకు టీబీ వ్యాధి, ఇతర చాకిరి పనులు చేయించొద్దని డిమాండ్ చేశారు. పాత బకాయిల ను వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మలేరియా, లెప్రసి వంటి సర్వేలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. అనంతరం తహసీల్దార్ అర్చనకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశాకార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి సావిత్రి, మండల ఆశాకార్యకర్తలు విజయ, స్వరూప, సునీత, కవిత, శివలీల, భారతి, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి: గురువారం తెలంగాణ వాలంటీర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల రిలే దీక్షలను జిల్లా అధ్యక్షురాలు మంజుల పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధిరాములు మాట్లాడుతూ మాట్లాడారు. కేసీఆర్ హామీలను అమలుచేయకపోతే ఈ నెల 23న చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సావిత్రి, ఉపాధ్యక్షురాలు శారద, ఎస్.జ్యోతి, లక్ష్మి, మంజల, భాగ్యలక్ష్మి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
రామారెడ్డి:తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు శాంత జె, అమల, కే వనిత, జీ సవిత, బి ప్రవళిక, శ్రీదేవి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
వర్ని: ఆంధ్రరాష్ట్రంలో అమలుచేస్తున్నట్టు ఆశావర్కర్లకు పదివేల రూపాయల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత అన్నారు. ఉమ్మడి మండలాల ఆశావర్కర్లు వర్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ..రాష్ట్రంలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం ఆశావర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకొని అవమానపరచడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు భూలక్ష్మీ, ఆసియా, లావణ్య, నీలా, సరోజ, ధరారిభాయి, చిత్ర పాల్గొన్నారు.
నిజాంసాగర్:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ధర్నా చేపట్టారు. జీతాలను ఐదు ఆరు నెలకొకసారి కాకుండా ప్రతి నెల వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు నశ్రీన్, మంజుల, రుక్మిణి, సావిత్రి, పార్వతి, లక్ష్మి, నాగమణి, విజయ, తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి: ఆశవర్కర్లకు ప్రభుత్వమే నేరుగా నెలకు రూ.10వేల వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తు ఎడపల్లి మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద మండలంలోని ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధించేవరకూ నిరసన వ్యక్తంచేస్తామన్నారు. ఈనెల 21న నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు ఆశావర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు రాజమణి తెలిపారు. కార్యక్రమంలో విజయ, అనిత, రేణుకలతో పాటు ఆయా గ్రామాల ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి:మండల పరిషత్ ఆవరణంలో మండలంలోని ఆశావర్కర్లు చేపట్టిన దీక్షలకు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, సీఐటీయూ బోధన్ నాయకులు శంకర్గౌడ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆశావర్కర్లను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఆశాల సేవలను గుర్తించకపోతే ఆందోళనలు తప్పవని పేర్కొన్నారు. ఆశావర్కర్లు అనురాధ, సునిత, తదితరులు పాల్గొన్నారు.
పిట్లం: మండలంలోని ఆశవర్కర్లు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల అధ్యక్షురాలు కామేశ్వరి మాట్లాడుతూ పారితోషకం లేని పనులు ఆశలతో చేయించరాదని ఆమె అన్నారు. కార్యక్రమంలో శశీకళ, సునిత, శోభ, కమలగాంధీ, మంజుల. లక్ష్మీ, స్వరూప, అనిత, సవిత, సావిత్రి, శోభ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి:మండల పరషత్ కార్యాలయం ఎదుట ఆశాకార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆశావర్కర్లు ఉమారాణి, గంగామణి, నాగరాణి, సావిత్రి, రాజమణి, సంతోషి ఉన్నారు.
దోమకొండ: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు టెంటు వేసుకుని దీక్షలు చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి లేదని టెంటును తొలగించారు. దీంతో ఆశావర్కర్లు రోడ్డుపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయు జిల్లా ఉపాద్యక్షులు నాగారపు ఎల్లయ్య మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తే టెంటును తొలగించడం దారుమన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సతీష్రెడ్డి అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. మళ్లీ టెంటు వేయించారు. జడ్పీటీసి తీగల తిర్మల్ గౌడ్ వారి ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు. అనంతరం ఆశాలు ఎంపీడీవో సతీష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
భిక్కనూర్:తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. వీరి ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నాగన్న మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు రేణుక, ఇందిర, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
లింగంపేట్:మండలంలోని ఆశావర్కర్లు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిలేదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆశావార్కర్ల మండల అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ ... ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆశాలతో పనిచేయిస్తున్నారని ఆమెమండిపడ్డారు. గతంలో ధర్నా చేపట్టగా పారితోషకాలు రూ.7500 ఇస్తామని ప్రచారం చేసి అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల లావణ్య, గంగామణి, సంగమణి, రాజ్యలక్ష్మి, స్వప్న, రాణి, వీరమణితోపాటు తదితరులు ఉన్నారు.
బోధన్ :తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆశాకార్యకర్తలు రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడారు. దీక్షలలో సుజాత, దివ్య, బాలామ్షా, రాజేశ్వరి, సాయవ్వ, లక్ష్మీ, రమా, నాగలత, సుజాత తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూలో ఆశావర్కర్లు చేరిక
నవతెలంగాణ-మోర్తాడ్
కమ్మర్పల్లి పీహెచ్సీ పరిధిలోని 45 మంది ఆశావర్కర్లు గురువారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు మాట్లాడుతూ సీఐటీయూ పోరాటాలతోనే తమకు గుర్తింపు వచ్చిందని అందుకే సీఐటీయూలో చేరామని తెలిపారు. అనంతరం నూర్జహాన్ మాట్లాడుతూ కార్మికుల కోసం వారి శ్రేయస్సు కోసం సీఐటీయూ పని చేస్తుందని అన్నారు. పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
Authorization