నవతెలంగాణ-కోటగిరి రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కళాశాలలోని ఫుడ్ టెక్నాలజీ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సౌజన్య, ఆఫీజ్ తయారు చేసిన వంటకాలను గురువారం మండల కేంద్రంలోని అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా శుద్ధమైన ఆహార వంటకాలను తయారు చేసినట్టు తెలిపారు. చికెన్, చేపల పచ్చళ్లు, జామ, సలాడ్ మొదలైనవి స్వయంగా రూ.2500లతో తయారు చేసి వాటిని అమ్మకానికి తీసుకొచ్చామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకాగౌడ్, ఏపీవో రమణ, ఎంపీడీవో ఆతారుద్దీన్, తదితరులకు పాల్గొన్నారు.