నవతెలంగాణ-ఎడపల్లి హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అధికారులు, ప్రజాప్ర తినిధుల నిర్లక్ష్యంతో అవి ఎండిపోతున్నాయి. అందుకు నిదర్శనం ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామపంచాయతీ ఆవరణలో నాటిన మొక్కలే. ఈ నెల 12న జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావ్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత, సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ సంజీవ్తో కలిసి మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డ్లు ఏర్పాటు చేయకపోవడం, అలాగే మొక్కలకు నీరు పోయకపోవడంతో అవి ఎండిపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.