- నాగన్పల్లి పంచాయతీ హెచ్చరిక నవతెలంగాణ-బోధన్ బోధన్ మండలంలోని కల్దుర్కి, నాగన్పల్లి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా పంచాయతీ మోటర్లు ప్రారంభించినా, రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ మలవిసర్జన చేసినా, అక్రమ నిర్మాణాలు చేసినా, మేకలు, పశువులు మొక్కలు తిన్నా, నీటి ట్యాంకుల వద్ద బట్టలు ఉతికినా, రోడ్లపై పశువులు కట్టివేసినా రూ.500ల నుంచి 5000వేల వరకు జరిమానాలు విధిస్తామని పంచాయతీ ఆధ్వర్యంలో బ్యానర్ ప్రదర్శించారు.