- అదనపు కలెక్టర్ లత నవతెలంగాణ-నవీపేట్ ఉపాధిహామీ ద్వారా చేపట్టిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో, ఉపాధి హామీ సిబ్బందితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై దృష్టి సారించాలని లేకుంటే చర్యలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఏపీఓ రాజేశ్వర్, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.