- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలుపశ్య పద్మ
నవతెలంగాణ-కామారెడ్డి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రభుత్వ రంగసంస్థలను కార్పొరేటుకు సంస్థలకు కట్టబెడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్యపద్మ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంజ్ ధర్మశాలలో సీపీఐ నిర్మాణ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్యపద్మ హాజరై మాట్లాడారు. బడాబాబులకు, పెట్టుబడి దారులకు సహజవనరులను కట్టబెడు తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పనిచేస్తుందని మోడీ ప్రభుత్వం లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ హిందుత్వ వాదానికి తెర లేపుతుందని అన్నారు. ప్రశ్నించినవారిపై దేశద్రోహం కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. మోడీ ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికీ కేవలం 36 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్బెడ్రూం, రైతుబంధులాంటి పథకాలు గాడి తప్పాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింద న్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు వీ.ఎల్.నర్సింహారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బాల్రాజు, దుబాసి రాములు, జిల్లా కార్యవర్గసభ్యులు దశరత్, జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎల్.దశరత్
సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎల్.దశరత్ను నియమిస్తన్నట్లు రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పశ్య పద్మ ప్రకటించారు. నిర్మాణ మహాసభలో ఆయనను కార్యదర్శిగా ప్రకటిస్తూ తీర్మాణం చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి దశరత్ మాట్లాడుతూ ...మతోన్మాదానికి వ్యతిరేకంగా బడుగు, బలహీనవర్గాల కోసం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
Authorization