- ఏఐకేఎంఎస్ బోధన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్
నవతెలంగాణ-ఎడపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం బోధన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ అన్నారు.మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి పంటతో పాటు ఆరుతడి పంటలకు కూడా మద్దతు ధరను ప్రభుత్వాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసే రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు సంఘటితంగా పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వాలు దిగిరావన్నారు. ఒకేసారి గ్యాస్ ధరలు రూ.148 పెంచి ప్రజలు మోయలేని భారాన్ని తలపై పెట్టాయన్నారు. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 28న బోధన్ పట్టణంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహిస్తామని, కర్షకులు, కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతిమల్లేష్, నాయకులు నారాయణ, లక్ష్మణ్, రవి, పోశెట్టి పాల్గొన్నారు.
Authorization