నవతెలంగాణ-బోధన్ పల్లెల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆర్డీవో గోపీరాం అన్నారు. మంగళవారం అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మానాన్న సేవా ట్రస్టు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతోనే పల్లెప్రగతి సాధ్యమవుతుందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమ లక్ష్యం నెరవేరాలంటే కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేసి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్రావ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్రావ్, హన్మంత్రావ్ పాల్గొన్నారు.