- జాగాలపై అక్రమార్కుల పాగా
- ఆక్రమించుకున్న పలువురు
- కాపాడాలని బాధితుల వేడుకోలు
నవతెలంగాణ-బోధన్
గతంలో అమ్దాపూర్ గ్రామానికి కస్తూర్బాగాంధీ విద్యాలయం మంజూరైంది. ఆ పాఠశాల నిర్మాణానికి భూమి లేకపోతే దళితులకు చెందిన భూముల్లోని మూడున్నర ఎకరాల్లో విద్యాలయం నిర్మించారు. అప్పటి అధికారులు నుంచి తీసుకున్న భూమికి బదులుగా మరోచోట 6 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పి వారితో కాగితాలపై సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు తమకు ఎలాంటి భూమినీ చూపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం నిర్మాణం కోసం మూడెకరాలు
ఇదే క్రమంలో గ్రామపెద్దలు మహంకాళి ఆలయం కోసం స్థలం కావాలని వారిని సంప్రదించారు. దీంతో ఆలయ నిర్మాణం కోసం మూడెకరాల స్థలం ఇచ్చారు. వారిని చూసి మరికొందరు తమకు ప్రార్థనల కోసం కొంత భూమి కావాలని కోరారు. అనంతరం వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మొరం వేసి రోడ్డు సైతం వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదికాకుండా కొందరు మత్స్యకారులు చేపల విక్రయం కోసం 10గుంటల భూమిని ఆక్రమించి పిల్లర్లు సైతం పాతారని, దీంతో తామే రంగంలోకి దిగి ఆయా పిల్లర్లను తొలగించామని దళితులు పేర్కొంటున్నారు. మిలిగింది 14 ఎకరాలు..
ఇలా ఆక్రమణలు పోను ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే ఇందులో నుంచి కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కొంత భూమిని కబ్జా చేసేం దుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తమ నుంచి ప్రభుత్వం తీసుకున్న 6 భూమికి బదులుగా మిగిలిన 14 ఎకరాల భూమిలో తమ 200 కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ఒక ఎస్సీ కమ్యూనిటీహాల్ను నిర్మించి ఇవ్వాలని దళితులు కోరుతున్నారు.
నీరు లేక సాగుచేస్తలేం..
సరైన నీటి సౌకర్యం లేక మాకిచ్చిన భూములను సాగు చేయకుండా వదిలేశాం. ఇదే అదునుగా మా భూములను కబ్జా చేస్తున్నారు. మా పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారికి పెండ్లిళ్లు చేశాం. ప్రస్తుతం పెద్దఇల్లు మాకు తప్పనిసరి. ప్రభుత్వం మాకిచ్చిన భూముల్లో డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలి.
- లింగమణి, అమ్దాపూర్
పెరిగిన కుటుంబాలతో ఎలా బతకాలి..
మాకు 45 ఏండ్ల క్రితం ప్రభుత్వం మాకు భూములు ఇచ్చింది. కానీ వాటిని కొందరు కబ్జా చేస్తున్నారు. మేము ముసలి వాళ్లమై పోయాం. మా పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వారితో చిన్న చిన్న ఇండ్లలో జీవించడం కష్టంగా ఉంది. గతంలో అధికారులు మమ్మల్ని నమ్మించి కేజీబీవీ కోసం ఆరెకరాల భూమి తీసుకున్నారు. మరోచోట భూమి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. కనీసం భూముల్లో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇసే మాకు సౌకర్యంగా ఉంటుంది.
- బేగరి ఒడ్డయ్య, అమ్దాపూర్
ఇచ్చిన భూములను గుంజుకుంటున్నరు..
ప్రభుత్వం పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి మాట తప్పింది. కనీసం మాకు ఇచ్చిన భూము ల్లోనైనా ఇండ్లు కట్టుకుం దామంటే దాన్ని కబ్జా చేస్తున్నా రు. ఇప్పటికే కసూర్బాగాంధీ పాఠశాల నిర్మాణం కోసం కొంత భూమి తీసుకున్నరు. మళ్లీ దాని గురించి మాట్లాడిన వారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో ప్రభుత్వం మాకిచ్చిన భూముల్లో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
- చందన, అమ్దాపూర్
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
దళితుల భూములను కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారి భూముల్లో ఏమైనా నిర్మిద్దామంటే అధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇతరులు భూమిని కబ్జా చేస్తే నోరుమెదపడం లేదు. ఈ విషయంపై ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం స్పందించి మిగిలిన భూమిలోనైనా వారికి డబుల్ ఇండ్లు నిర్మించి వారికి న్యాయం చేయాలి.
- గంగాధర్అప్పా, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు
Authorization