చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రచురణలు హైదరాబాద్ బాల చెలిమి వారి సౌజన్యంతో సంపాదకుడు కుమార్ వెలువరించిన తెలంగాణలోని పూర్వ పది జిల్లాల్లోని బడిపిల్లలతో కథలు రాయించి ముద్రించిన పుస్తకాలు. వీటిలో నుంచి మన నిజామాబాద్ జిల్లా చిన్నారుల కథల పై సమీక్ష.
నవతెలంగాణ, కంఠేశ్వర్
మన పూర్వీకులు తమ మనవళ్లు, మనవరాళ్లకు చిట్టిచిట్టి కథలతో పాటు అభూత కల్పన, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే కథలతో పాటు దెయ్యాలు, భూతాల తో కూడినవి చెప్పి పిల్లలను ఆనందింపజేసే వారు. వీరు బాల్యంలో విన్న కథల్లోని విషయాలను అవగాహన చేసుకొని తమ జీవి తాలకు అన్వయించుకునేవారు. పైగా తమ ఊహాశక్తితో భవి ష్యత్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతుక్కునే వారు.
కనుమరుడైన ఉమ్మడికుటుంబాలు
ప్రస్తుతం చూద్దామన్నా ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. కొన్ని కుటుంబాల్లో వృద్ధులు కనిపించడం లేదు. దీంతో పిల్లలకు మంచి బుద్ధులు చెప్పి వారిని సన్మార్గంలో పెట్టేవారు కనుమరుగైపోయారు. దీనికితోడు ఉరుకులు పరుగుల జీవితాలతో పిల్లల మానసిక వికాసాన్ని పెంపొందించే వారే లేకుండా పోయారు. అందుకే పిల్లల్లో మనిషికి కావాల్సిన మానవతా విలువలు కొరవడి పోతున్నాయి. పాఠశాలల్లో కూడా నీతి కథలు, పాటలు బోధించడం లేదు. పూర్వం ఇలాంటి నీతి కథలకు ప్రత్యేకంగా ఒక పీరియడ్ ఉండేది. బహుశా ఇది గమనించే కాబోలు మన రాష్ట్ర చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారు పిల్లలతో వారికి అవసరమైన చిట్టి కథలు వ్రాయించారు. వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి జనవరి 29 2020 హైదరాబాద్లోని కేంద్ర గ్రంథాలయంలో తెలంగాణ తెలుగు అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మన నిజామాబాద్ జిల్లా పుస్తకం ముఖచిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కైరం కొండబాబు (ఆంధ్రనగర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు) చిత్రీకరించారు.
పుస్తకంలో 18 కథలు..
తడపాకల్ పాఠశాల నుంచి 7వ తరగతి విద్యార్థిని శివాణి రాసిన కథ బంగారు చేప. సోమరి అయిన తమ కుమారుడు పనీపాటా లేక ఆవారాగా తిరుగుతూ ఉంటే ఓ రుషి చేత నీవు మీ కులవృత్తి అయినా చేపల వేట చేస్తూ ఉంటే కొన్నాళ్లకు బంగారుచేప దొరుకుతుందని చెప్పించారు. అతను వేటాడిన చేపలను విక్రయించగా వచ్చిన డబ్బుతో అతని తల్లిదండ్రులు బంగారుచేపను చేయించి తమ కొడుకు తెలియకుండా ఓ చిన్న పెట్టెలో దాచి ఉంచారు. దాన్ని చూసినా అబ్బాయి సంబురంలో పనిలో మరింతగా నిమగమయ్యాడు. ఈ కథ ఒక మంచిసందేశం ఇస్తుంది.
పరిష్కారం..
నిజామాబాద్లోని విజరు పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని స్వప్నిక 'పరిష్కారం' అనే కత రాసింది. ఇందులో ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా దాని టైర్ పంక్చర్ అయింది. టైరును మార్చే ప్రయత్నంలో దాని నట్లు పొరపాటున పక్కనే ఉన్న చెరువులో పడిపోతాయి. దీంతో ప్రయాణికుడు విచారంలో ఉంటాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఓ పశువుల కాపరి అతడి వద్దకు వస్తాడు. ఏమైందని ప్రశ్నిస్తాడు. అంతా విని అయ్యో అంతేనా మిగతా మూడు చక్రాల నుంచి ఒక్కొక్క నట్టు తీసి పంక్చర్ అయిన టైర్కు వేసి బిగించాలని సలహా ఇస్తాడు. దీంతో కారు యజమాని నీకున్న జ్ఞానం నాకు లేక పోయె అని అతడిని మెచ్చుకుంటాడు. ఈ కథంలో సమయస్ఫూర్తి అన్ని సమయాల్లో మనల్ని కాపాడుతుందనే నీతిని బోధిస్తుంది.
మిగతా కథలు..
మిగతా విద్యార్థులు వరుసగా వైష్ణవి : అవయవదానం, అక్షిత: నక్క కోడి పుంజుల, గ్రీష్మ: సహాయం చేసే స్నేహితులు, శ్వేత: మార్పు, తేజ: ప్రోత్సాహం, సాకేత్: విజయమా నైపుణ్యమా, శరణ్యదేవి: చదువు ప్రాముఖ్యత, రిషిక్: అత్యాశ, వైభవ్: మంచి స్నేహితులు, వైష్ణవి: మంచి..చెడు, మనస్విని: సహాయం, శ్రీముఖి: కానుక, చిన్మయి: అన్నం పరబ్రహ్మం వంటి కథలు రాశారుర. ఇలా మన జిల్లా నుంచి పిల్లల కోసం మరిన్ని నీతివంతమైన, విజ్ఞాన దాయకమైన, మూఢాచారాలను నిర్మూలించే కథలు రచించి పిల్లలను మంచి నాగరికులుగా తీర్చిదిద్దేందుకు ఉపా ధ్యాయులు, విజ్ఞులు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించాలి.
సమీక్షకుడు : దారం గంగాధర్ ఎంఏ, బీఈడీ
ప్రముఖ కథా రచయిత, విశ్రాంతఉపాధ్యాయుడు, నిజామాబాద్ జిల్లా
సెల్నెంబర్ : 9848384777
Authorization