కాళూ ్లచేతులు వణుతున్నాయి. అడుగులు సరిగా పడటం లేదు. బ్యాలెన్స్ తప్పుతోంది. నడిచేటప్పుడు భంగిమ సరిగా ఉండటం లేదు. శరీరం కొద్దిగా ఒంగిపోతోంది. నడకకు బ్రేకులు పడుతున్నాయి. కొద్దిదూరం వెళ్లగానే అనుకోకుండా ఒక్కసారిగా ఆగిపోవాల్సి వస్తోంది. పాదాలు భూమికి తాకడం లేదు. మాట నత్తిగానూ, నెమ్మదిగానూ వస్తోంది. ఏమిటీ పరిస్థితి? ఎందుకలా.. శారీరక బలహీనత వల్లేనా? కావచ్చు. కానీ... దీన్ని అదే కారణమని అనుకోవడానిక్కూడ వీల్లేదు. ఇది 'పార్కిన్సన్' కావచ్చు. అంటే ఏమిటి? పార్కిన్సన్.. ఇది సర్వసాధారణ వ్యాధి. 60 ఏండ్లు దాటిన వారికి ఇది సంభవిస్తుంది. దీన్ని వృద్ధాప్యం లో వచ్చే రుగ్మతగా పరిగణిస్తారు. పార్కిన్సన్ని ఇప్ప టికీ కారణం తెలియని వ్యాధిగానే పరిగణిస్తు న్నారు. పర్యావరణ కాలుష్యం, విషపదార్థాలు, ఎరువులు, కొన్ని మందుల వల్ల దీనిబారిన పడతారని అంటున్నారు నిపుణులు. జన్యుపరంగానూ రావచ్చని చెబుతున్నారు. మెదడులో ఉత్పన్నమయ్యే డొప మైన కణాలు తగ్గిన పక్షంలో ఈ వ్యాధిని నిర్ధారిం చొచ్చని అంటున్నారు. ప్రోటీన్లకు సంబంధించిన రుగ్మత 'ప్రొటీనోపతి' వల్ల కూడా పార్కిన్సన్ వ్యాధి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. నిర్ధారణ రోగి గత చరిత్ర, శారీరక పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించొచ్చు. దీనికి '18 ఎఫ్ ప్లురోడొపా పీఈటీ' అనే ప్రత్యేక పరీక్ష చేయాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు చేయాలి. మెదడలో ఏమైనా లోపాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. ఈ వ్యాధిని సరైన విధానంలో నిర్ధారించాలంటే న్యూరాలజిస్ట్ పరీక్షించాలి. ప్రొగ్రెసివ్ సుప్రన్యుక్లియర్ పాల్సీ, మల్టీసిస్టం ఆట్రోఫీ, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ తదితర వ్యాధులు కూడా పార్సిన్సన్ వ్యాధి లక్షణాలకు అతి దగ్గరగా ఉంటాయి కాబట్టి దీన్ని న్యూరాలజిస్ట్ నిర్ధారించడం తప్పనిసరి.