పండ్లు దొరికితే చాలు.. ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు కొందరు. ఇది మంచి పద్ధతి కాదు. ఉదయం ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత పండ్లు తినాలి. ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల అవి శరీరంలోని జీవక్రియలను డిటాక్స్ చేయడానికి చాలా సహాయపడతాయి. అంతే కాదు.. ఈ సమయంలో తీసుకునే పండ్ల వల్ల వాటిలోని పూర్తి పోషకాలతో పాటు విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్గా పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను వేగవంతంగా పనిచేస్తుంది. ఇంకా శరీరంలోని తక్కువగా ఉన్న బ్లడ్ షుగర్ లెవల్స్ ని నిదానంగా పెంచడానికి సహాయపడుతుంది. రోజూ వ్యాయామం చేస్తున్నట్లైతే పండ్లను ఫర్ ఫెక్ట్ స్నాక్గా తీసుకోవచ్చు. వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవడం మంచిది. పండ్లు మన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ని నిర్వహిస్తుంది. కానీ ఇది కడుపు ఫుల్ గా లేదా ఉబ్బరంగా అనిపించదు. శరీరం కూడా ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీ కరిస్తుంది. వ్యాయామం చేయడానికి బాడీ సెల్స్కి ఇన్సులిన్ స్థాయిలను పంపిస్తుంది. భోజనానికి గంట ముందు పండ్లు తీసుకోవడం చాలా మంచిది. అలాగే భోజన చేసిన రెండు గంటల తర్వాత పండ్లు తీసుకోవడం ఎంతో మేలు. దీంతో విటమిన్-సీ, పెక్టిన్, ఫైబర్లు పూర్తిగా శరీరంలోని వ్యాప్తి చెందుతాయి. పండ్లను ఈ విధంగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్రక్టోజ్ ద్వారా శోషణ నెమ్మదిగా ఉంటుంది. మిగిలిన ఫ్రక్టోజ్ జీర్ణవ్యవస్థలో ఉండి ఆర్గానిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. కడుపు ఉబ్బరం, అతిసారకు దారితీస్తుంది. పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటి పండ్లను పెరుగుతో పాటు తినొచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తీసుకోవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకన్నా పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. వీలైనంత వరకు పండ్లను ఉడికించిన ఆహారాల మధ్య తినొద్దు. ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారు భోజనం తర్వాత రెండు గంటల తర్వాత పండ్లు తినాలి.