వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదు కూడా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఇది ఎక్కువ. మెనోపాజ్ అనంతరం కాళ్లూ చేతులు, తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకుపోవటం ప్రారంభిస్తుంది. కడుపును పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం. ఇది వంశ పారంపర్యంగానూ రావొచ్చు. ముట్లుడిగిన తర్వాత కలిగే హార్మోన్ల మార్పు కూడా దీనికి దోహదం చేస్తుంది. బరువు పెరగకుండా కడుపు పెరుగుతున్నా ప్రమాదకరమే.పొట్ట మూలంగా రకరకాల జబ్బులు దాడి చేసే ప్రమాదముంది. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మధుమేహం, జీవక్రియల అస్తవ్యస్తం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణం కావొచ్చు.
ఎత్తు బరువుల నిష్పత్తిని (బీఎంఐ) బట్టి అధిక బరువును గుర్తించొచ్చు గానీ దీంతో శరీరంలో కొవ్వు శాతాన్ని తెలుసుకోలేం. నడుం చుట్టు కొలత ద్వారా పొట్ట భాగంలో కొవ్వు ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయాన్ని పసిగట్టొచ్చు.
ఎలా చూడాలి?
ముందు బొడ్డు భాగంలో కడుపు చుట్టూ టేపును చుట్టండి.
శ్వాస మామూలుగా తీసుకోండి. కడుపును లోపలికి పీల్చొద్దు.
చర్మం నొక్కుకుపోయేలా టేపును మరీ బిగుతుగా కూడా బిగించొద్దు.
నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే అదుపులోనే ఉన్నట్టు.
35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు పేరుకుందని అర్థం.
తగ్గించుకునేదెలా?
కొన్ని రకాల వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో పొట్టను తగ్గించుకోవచ్చు.
పొట్టను తగ్గించుకోవటానికి రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమ మార్గం. దీంతో బరువుతో పాటే పొట్ట కూడా తగ్గుతూ వస్తుంది. బరువులు ఎత్తే వ్యాయామాలూ పొట్ట తగ్గటానికి ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే.. ఎంతసేపు, ఏయే రకాల వ్యాయామాలు చేయాలన్నది శారీరక శ్రమ, పనులనుబట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికేది అవసరమో వైద్యుల సలహా మేరకు నిర్ణయించుకోవాలి.
సహజ వ్యాయామం నడక. ఇతర వ్యాయామాలు చేసేవారు కూడా నడవాల్సిందే. 15 నిమిషాలకు 1.5 కిలోమీటర్లు వేగంగా నడవాలి. రోజుకు సుమారు 3 కి.మీటర్లు నడిస్తే మంచిది.
పరుగు కాళ్లకు బలాన్నిస్తుంది. కొవ్వును బాగా కరిగిస్తుంది. ఎత్తు పల్లాలో కొండల మీదికి నడక, పరుగు , ఎక్కి దిగ గలిగితే పాదం నేలమీద తాకే సమయం బాగా తగ్గుతుంది. ఫ్యాట్ కరిగేందుకు ఇది దోహదపడుతుంది. అయితే.. గుండె జబ్బులున్న వారు కొండలెక్కడం మంచిది కాదు .
మామూలు వ్యాయామం, ఆహార నియమాలతో పొట్ట తగ్గకపో తుంటే.. దాని కండరాలను దృఢం చేసే వ్యాయామ పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా పొత్తి కడుపు, కడుపులోపలి కండరాలను పటిష్టం చేయటంపై దృష్టి సారించాలి.
శ్వాసక్రియను ఛాతీకి పరిమితం చేయక కిందనున్న పొట్టను పైకిలా గుతూ శ్వాసను పీల్చి వదలడం చేయాలి. ఇది పరుగెడుతున్నప్పుడు చేయాలి. ఉదర భాగంతో కలిపిన శ్వాసక్రియ వల్ల శరీర రూపంలో మార్పు వస్తుంది . పొట్ట లోపలికి పోతుంది.
పరుగు చక్కని వ్యాయామం. అయితే.. పొట్ట బాగా తగ్గాలంటే వీపునకు ఏదైనా బరువును కట్టుకుని పరుగెత్తడం మంచిది. దీంతో కొవ్వు కరిగిపోతుంది. కొత్తగా కొవ్వు చేరదు.
అరుదుగా కొందరికి మెనోపాజ్ అనంతరం హార్మోన్ రిప్లేస్మెంట్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకోవటం కూడా ఉపయోగపడుతుంది.
ఆహార పదార్థాలు కొనేటప్పుడు సంతృప్త కొవ్వులకు బదులు పాలీ అసంతృప్త కొవ్వులు ఉండేవి ఎంచుకోవాలి. మామూలు పిండి పదార్థాలున్న పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్కి బదులు సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ తినటంతోపాటు క్యాలరీలనూ తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు.
గుడ్డులోని తెల్లసొన , అన్ని రకాల పండ్లు , పచ్చిగా తినగలిగే కూర గాయలు, ఆవిరి మీద ఉడికే కూరగాయలు, పాలు , పెరుగు , మజ్జిక , రాగులు తీసుకుంటూ ఉండాలి.
ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి . ఉదయం ఏమీ తినకపోవడమంటే ఎవరికి వారు శిక్ష విధించు కోవడమే. ఉదయం నిండి సాయంత్రం వరకూ చేసే పనులన్నింటికీ తగిన శక్తినిచ్చేది అల్పాహారమే. దీన్ని తీసుకోవడం వల్ల శరీర బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి.
నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి . నీరు తాగడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగ వుతుంది.
నిద్ర వల్ల రెండు రకాల లాభాలున్నాయి. ఒకటి కండరాలు అలసట నుంచి తేరుకుంటాయి. నిద్రలో ఎక్కువ కాలరీలు కరుగుతాయి. నిద్ర తగినంత పోకపోతే బలహీన పడతారు. అదనపు కొవ్వు పేరుకుపోతుంది.
నిరంతరం టెన్షన్ మంచిది కాదు . ఒత్తిడిలో ఉన్నవారు ఆహారం అధికంగా తీసుకుంటారు. దీంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది. సరైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి. గాబరా గాబర గా ఏదో ఒకటి తింటూ ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండకూడదు .
ఆహారం మానేయొద్దు
బరువు తగ్గాలి అనగానే ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఇటు వంటి డైటింగ్ ప్రమాదకరం . లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి . శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు సమ పాళ్లలో లభించేలా ఆహారం తీసుకోవాలి. పరిమితమైన ఆహారమే తీసుకోవాలి. సాయంకాలం ఏదో ఒకటి తినాలి . ఆకలితో ఉండ కూడదు . ఎండిన పల్లు, కొవ్వులేని ఆహార పదార్థాలు తాజా పండ్లు తినాలి. నూనెలో ముంచి తేలిన చిప్స్ , నూడిల్స్ లాంటివి అస్సలు తీసుకోవద్దు. ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకుంటే అధిక బరువు పెరుగుతారు. ఉప్పుకు శరీరంలో నీటిని , కొవ్వును నిల్వ చేసే గుణం ఉంది. ఫలితంగా బరువు పెరుగుతారు .చలాకీతనం తగ్గుతుంది. అందుకే... రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడొద్దు.
రుచికి బాగుంటాయని ఎక్కువ మంది వేపుడు కూరలు తింటారు. ఆరోగ్యరీత్యా ఇవి మంచివి కావు. కూరలన్నింటినీ సగం మేర ఉడికించి ఆ తర్వాత కొద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యం లభిస్తాయి.
Authorization