ఉన్నట్లుండి గొంతు మారిపోతుంది. మరుసటి రోజు ముక్కు నుంచి నీరు రావటం ప్రారంభమై జలుబు చేస్తుంది. మరొకరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. ఇంకొకరికి కారణం లేకుండా ఒళ్లు వెచ్చబడి ఆయా సంగా ఉంటుంది. శ్వాస వదిలేటప్పుడు పిల్లికూతల వంటి శబ్దం వస్తుంది. మరికొందరికి హఠాత్తుగా కాళ్లు, చేతుల వేళ్ల మధ్య దురద ప్రారంభమవుతుంది. ఇవన్నీ రావడానికి ఒకే కారణం. అదే అలర్జీ. దీన్ని కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు.
మానవ శరీరం ఒక అద్భుతం. శరీరంలో ఎలాంటి అన్య పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దాని కుంటుంది. దీన్నే ఇమ్యునిటీ లేదా రోగనిరోధక శక్తి అంటాం. దీని వల్ల మన శరీరంలోనికి గాలి, నీరు, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతీకూల పదార్థాలు బ్యాక్టీరియా, వైరస్, అన్యపదార్థాలు వచ్చినా తెల్ల రక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వల్ల కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీన్నే 'హైపర్ సెన్సిటివిటీ' లేదా అలర్జీ అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో, రెండో తుమ్ములు రావడం సహజం. అయితే అలర్జీతో బాధపడేవారికి ఇక అదేపనిగా వరసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దాంతోపాటు కళ్లు ఎరుపెక్కి నీరుకారుతుం టుంది. ఈ పరిస్థితిని 'అలర్జిక్ రైనైటిస్' అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కల్లె వస్తుండడం, ముఖం లోపలి భాగంలో నొప్పిగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే అలర్జిక్ సైనసైటిస్ అంటాం. క్రమంగా ఈ వ్యాధి గాలి గొట్టాలలోకి, ఊపిరితిత్తులకు పాకి పొడి దగ్గు, తర్వాత కల్లెతో కూడిన దగ్గుగా మొదలవుతుంది. దాన్ని 'అలర్జిక్ బ్రాంకైటిస్' అంటాం. ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తే 'అలర్జిక్ ఆస్తమా' అంటాం.
మనచుట్టూ ఉండే చెట్టు , చేమ , జంతువులు వంటివి చిన్న చిన్న రేణువుల లాంటి పదార్థాలు విడుదల చేస్తూ ఉంటాయి . వీటిని 'పోలెన్' అంటాం. ఈ పదార్థాలను ఇతరచోటికి వ్యాపించి ఆ వృక్ష జాతుల్ని మళీ ్ల పుట్టిం చడం వాటి ధ్యేయం. కానీ... ఇవి ఆ ధ్యేయానికి చేరక మునుపే మనుషుల ముక్కు , గొంతుక , చర్మం , కళ్లు వంటి వాటిని చేరుతాయి. ఈ శరీరంపై తనది కాని పదార్థం తనలో చేరినపుడు వికటిస్తుంది. అంటే.. రియాక్ట్ అవుతుంది. అదే అలర్జీ.
ముక్కు దిబ్బడేసి జలుబు చేస్తే 'ఎలర్జిక్ రైనైటిస్' అంటాం. జ్వరం వస్తే 'హేఫెవెర్' అంటాం. ఎన్నో ఇలాంటి చిన్న చిన్న రేణువులు ప్రకృతిలో ప్రయాణించి వివిధ వ్యాధులను కలుగజేస్తాయి. ఈ 'పోలెన్ ' అనే పదార్థం ఎక్కువగా అలర్జీని తీసుకొస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని జంతువుల స్పర్శ, దుమ్మూధూళి, కొన్ని మందులు , కొన్ని రసాయనాలు లాంటివి అలర్జీని కలుగ జేస్తాయి. అయితే...ఇవన్నీ అందరికీ అలర్జీని కలుగజే స్తాయని భావించొద్దు. ఎవరి శరీరంలో వ్యాధి నిరోధకశక్తి చక్కగా ఉంటుందో వారికి ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. శరీరతత్వం సున్నితంగా ఉండేవారికి అలర్జీ సులభంగా వస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు, తీవ్ర జ్వరం వచ్చి తగ్గిన తర్వాత, ఆడపిల్లలు రజస్వల అయ్యే సమయంలో, గర్భణధారణ సమయంలో, రుతువులు మారే సంధికాలంలో, చాలాకాలం క్షయ, రక్తహీనత, షుగరు, ఉబ్బసం, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఈ అలర్జీ రావచ్చు.
ఏం చేయాలి?
అలర్జీని కలుగజేసే పరిసరాలకు దూరంగా ఉండాలి. అలాంటి పదార్థాలు తీసుకోవద్దు. వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే మందులు వాడాలి. శీతలపానీయాలు, చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. దుమ్మూదూళితో జాగ్రత్త పడాలి. అలాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కాస్మొటిక్స్, స్ప్రేలు, పౌడర్లు, హెయిర్ డైలు వాడేముందు వైద్యుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి. రోజూ శారీరక వ్యాయామం చేయాలి. పడని ఆహార పదార్థాలు తీసుకోవద్దు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. భోజనం కూడా సమయానికి చేయాలి. అలర్జీ ప్రభావాన్నిబట్టి వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.
Authorization