ఇంటర్నెట్ని అదేపనిగా ఉపయోగి స్తున్నారా? జర జాగ్రత్త. మానసిక రుగ్మతలకు ఇది దారితీస్తుందట. ఎథిలాజికల్ ఎల్యూసివ్ డిజార్డర్స్ నెట్వర్క్ (ఈఈడీఆర్ఎన్) చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎక్కువ సమయాన్ని ఇంట ర్నెట్పై వెచ్చిస్తే చిరాకు, ఆందోళన, పరధ్యానం లాంటి సమస్యలు ఉత్పన్న మవుతాయని తేలింది. అంతేకాదు.. శారీరకంగా కొన్ని వ్యాధులకు ఇది కారణమవుతుందని వెల్లడైంది. దీని వల్ల సామాజిక బాంధవ్యాలకు విఘాతం ఏర్పడుతుందని కూడా పరిశోధకులు గుర్తించారు. 'చాలా మంది ఇంటర్నెట్ని అదే పనిగా ఉపయోగి స్తుంటారు. ఈ క్రమంలో అనేక సున్నితమైన అంశాలు తెలుసు కుంటారు. వాటిపై స్పందిస్తుం టారు. కొన్ని సార్లు తీవ్రమైన ప్రతిచర్యలకు పాల్పడ తారు. ఇది మానసిక, శారీరక రుగ్మతలకు దారి తీస్తుంది' అని ఈఈడీరఎన్ ప్రతినిధు లు వివరించారు. ఈఈడీఆర్ఎన్ అనేది దేశంలోని ప్రముఖ వైద్య పరిశోధనా కేంద్రాలకు చెందిన వైద్యులు, నాడీ శాస్త్ర పరిశోధకుల సంయుక్త సంస్థ. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంబేద్కర్ బయోమెడికల్ రిసెర్చ్ సెంటర్, హర్యానాలోని నేషనల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంటర్ నిపుణుల భాగస్వామ్యంతో దీని నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్ వ్యసనంగా మారితే కలిగే ప్రతికూల ప్రభావాలపై ఈ సంస్థ ఇటీవల అధ్యయనం చేసింది.