- ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి కొంతమేరకు ఫలితాలను ఇస్తున్నాయి.
- క్యాన్సర్ నియంత్రణ దిశగా గొప్ప ముందడుగు పడింది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు సార్వత్రిక రక్తపరీక్ష విధానాన్ని రూపొందించడంలో వైద్య పరిశోధకులు మంచి ఫలితాలు సాధించారు. క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణ అయిన ప్రతీ ఐదుగురిలో నలుగురు వ్యాధి నిర్ధరణ అయ్యాక ఏడాదిలోపే చనిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల ఫలితాలు అందుబాటులోకి వస్తే క్యాన్సర్ మరణాలను చాలా వరకు అరికట్టవచ్చు.
- అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బ ందం ఎనిమిది రకాల క్యాన్సర్లను గుర్తించే ఒక విధానాన్ని పరీక్షించి చూసింది.
క్యాన్సర్ కణితులకు చెందిన పరివర్తిత జన్యువులు, ప్రొటీన్ల జాడలు రక్తంలోకి విడుదలవుతాయి. వాటిని పసిగట్టడమే ఈ రక్తపరీక్షలో కీలకాంశం. క్యాన్సర్ను సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు తద్వారా వ్యాధిగ్రస్థుల ప్రాణాలు కాపాడేందుకు వీలుగా రక్తపరీక్ష విధానాన్ని రూపొందించాలన్నది ఈ బందంలక్ష్యం.
క్యాన్సర్ కారక ప్రొటీన్లను గుర్తించేలా..
ఈ పరీక్షను 'క్యాన్సర్ సీక్' పరీక్షగా పిలుస్తారు. ఇందులో- క్యాన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా 16 జన్యువులకు సంబంధించి ఏర్పడే జన్యు పరివర్తితాలను, రక్తంలో తరచూ విడుదలయ్యే ఎనిమిది ప్రొటీన్లను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తారు.
1,005 మంది క్యాన్సర్ రోగులపై తమ విధానాన్ని నిపుణుల బ ందం పరీక్షించి ఫలితాలను పరిశీలించారు.
ఈ బాధితులు అండాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమ గ్రంథి, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకినవారు. పరీక్ష జరిపిన సమయానికి ఇతర కణజాలాలకు క్యాన్సర్ వ్యాపించలేదు. నిపుణుల బ ందం పరీక్షలో 70 శాతం క్యాన్సర్లు నిర్ధరణ అయ్యాయి.
''క్యాన్సర్ను ముందే గుర్తించగలగడం కష్టతరమైనది. బ ందం సాధించిన ఫలితాలు చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. క్యాన్సర్ మరణాలను అడ్డుకోవడంలో ఈ పరీక్ష గొప్ప ప్రభావాన్ని చూపగలదు'' అంటున్నారు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన డాక్టర్ క్రిస్టియన్ టొమసెట్టి.
క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అందించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అండాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమ గ్రంథి, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్లు- ఈ ఎనిమిది క్యాన్సర్లలో ఐదింటిని ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ విధానాలు లేవు. క్లోమ గ్రంథికి వచ్చే క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టం. వ్యాధి లక్షణాలు కొన్నే ఉంటాయి. ఇది బాగా ఆలస్యంగా బయటపడుతుంది.
కొనసాగుతున్న ప్రయోగాలు
క్యాన్సర్ను గుర్తించేందుకు ఏడాదికి ఒకసారి నిర్వహించే రక్తపరీక్ష విధానాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
శస్త్రచికిత్స చేసి తొలగించగలిగే దశలోనే కణితులను గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. నిపుణుల బ ందం 'క్యాన్సర్ సీక్' విధానాన్ని ప్రస్తుతం క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణ కాని వ్యక్తులపై పరీక్షించి చూస్తోంది.
రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మామోగ్రామ్, కొలరెక్టల్ క్యాన్సర్ను గుర్తించేందుకు కొలనోస్కోపీ ఉన్నాయి. ఇలాంటి కొన్ని విధానాలకు తోడుగా ఈ రక్తపరీక్షను ఉపయోగించవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు.
'క్యాన్సర్ సీక్' పరీక్ష విధానంలో క్యాన్సర్ కణితులకు చెందిన పరివర్తిత జన్యువులు, ప్రొటీన్ల జాడలు రెండింటినీ పసిగట్టేందుకు ప్రయత్నిస్తారు. 'క్యాన్సర్ సీక్' విధానంతో వ్యాధి నిర్ధరణకు ఒక్కో వ్యక్తికి రూ.32 వేల (ఐదు వందల డాలర్లు) వరకు ఖర్చు అవుతుంది.
Authorization