జీవనశైలిలో మార్పులతో ఆధునిక జీవనానికి అలవాటు పడేవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతాబాగానే ఉన్నాం అను కుంటూ సరైన పోషకాహారం తీసుకువడంతో అలసత్వం చూపిస్తారు. శారీరక శ్రమ లేకపోవడంతో అధికబరువు, రక్తపోటు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా నాలుగుపదులు దాటిన వయసులో జాగ్రత్తలు తీసుకోకపోతే.. భవిష్యత్లో అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే. సాధారణంగా నలభై దాటిన ఏజ్ గ్రూప్ వారు ఏదో ఒక ఉద్యోగం, ఉపాధిలోనూ ఉంటారు. వారి దైనందిన కార్యక్రమాలే పెద్ద ఎక్సర్సైజ్గా భావిస్తారు. రోజూ అరగంట నడవడానికి కూడా బద్ధకిస్తారు. ఇలాంటివారిలో కీళ్ల సమస్యలు, రక్తపోటు, మధుమేహం ఎక్కువగా వస్తాయి. వీళ్లు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు రెగ్యులర్గా హెల్త్చెకప్స్ చేయించుకోవాలి. మహిళలు తప్పకుండా పాప్స్మియర్, మమోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరబరువు పెరిగితే ఎముకలు అరిగిపోతాయి అన్న విషయం గుర్తుంచుకోవాలి. శరీరంలో శక్తి ఉన్నప్పుడు బయటపడని అనేక అనారోగ్యసమస్యలు తమ విశ్వరూపాన్ని చూపించేది 45 నుంచి 60 మధ్య వయసులోనే. ఆహారం విషయంలో పరిమితులు పాటించాలి. బి.పి, మధుమేహం ఉన్నవారు కనీసం మూడు నెలలకు ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్ తప్పనిసరిగా డాక్టర్ సూచనల మేరకు తీసుకోవాలి. ఇక అరవై తర్వాత కీళ్లనొప్పులు, మగవారిలో ప్రోస్టేట్ సమస్యలు ఎదురవుతాయి. వీటిని నివారించడానికి క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళల్లో మెనోపాజ్ వస్తుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే అనారోగ్యసమస్యలపై అవగాహన పెంచుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి.