కంప్యూటర్ మీద పనిచేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇటీవల వస్తున్న కొన్ని రకాల ఆరోగ్యసమస్యలకు కంప్యూటర్ మీద ఎక్కువ సేపు కూర్చొవడం కారణం అవుతుంది. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారికి చూపు మందగిస్తుంది. వెన్నునొప్పి వేధిస్తుంది. ఇలాంటి సమస్యల నుండి కొంతమేరకైనా విముక్తి పొందాలంటే.. కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడంతో పాటు కంప్యూటర్ వాడకాన్ని కాస్త తగ్గించండి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.. కంప్యూటర్ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారు ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి విశ్రాంతి నిచ్చి దూరపు చూపు చూస్తూ విశ్రాంతి తీసుకోవాలి. వెలుతురు సరిగ్గా లేని చోట...చీకటిలో కంప్యూటర్ వాడటం మానుకోవాలి. ఏసీ, వెంటిలేటర్ల నుండి వచ్చే గాలి నేరుగా ముఖంపై వచ్చి పడకుండా చూసుకోవాలి. వాహనంలో వెళ్లే సమయంలో ల్యాప్టాప్, టాబ్ వంటివి ఉపయోగించవద్దు. కంటిపై ఎక్కువ శ్రమ పడుతుంది. కంప్యూటర్ను కనీసం అరమీటర్ దూరంలో ఉంచాలి. నిటారుగా కూర్చోవాలి. ప్రతి గంటకు ఒకసారి ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి.