నోరు మనిషికి ముఖద్వారం లాంటిది. ఆ నోటిలో అత్యంత ముఖ్యమైన భాగం దంతాలు. ఇవి ఆహారాన్ని చక్కగా నమిలి అతి చిన్న భాగాలుగా చేసి అన్నవాహిక ద్వారా జీర్ణాశయానికి పంపి జీర్ణక్రియను సులువుగా జరగడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ దంతాలు గనుక లేకపోతే మనిషి కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోగలడు.
సహజంగా మనిషికి 32 దంతాలుంటాయి. వాటిలో ముందు రెండు పండ్ల్లను ''సెంట్రిల్ ఇంసయిసర్స్'' అంటారు. ఇవి మనం తినే ఆహారాన్ని కటింగ్ చేసి చిన్న ముక్కలుగా చేసేందుకు పనికి వస్తాయి. వాటి పక్కన ఉన్న దంతాలను ''లెటరల్ ఇంసయిసర్స్'' అంటారు. మిగతా పండ్లను ''కెనాయిన్స్'', ''ప్రియోలార్స్'', ''మోలాల్స్'' గా పిలుస్తారు. దవడపండ్లు గ్రైండింగ్కు ఉపయోగపడుతాయి.
దంతాలు కేవలం ఆహారం నమలడానికి మాత్రమే కాదు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనిషి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మాటలు స్ఫష్టంగా రావడానికి ఇవి ఎంతగానో అవసరం.
దంతాలలో ఉండే భాగాలు..
1. ఎనామిల్
2. డెంటిన్,
3. పల్ప్
- పంటి రంగు డెంటిన్ వల్ల పొందుతుంది.
- దంతాలు దవడ ఎముకలో అందంగా అమర్చబడి ఉంటాయి.
- చిన్న పిల్లలో ఇవి పాల రంగులోఉంటాయి. అందువల్ల పాలపళ్ళు అంటారు.
- పాల పండ్లలో ప్రిమోలార్స్ ఉండవు. వీటి మధ్య సందులు ఉండటం సహజం.
- దంతాలు పుచ్చిపోవడం అతి సహజం. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. దంతాలు పుచ్చిపోవడానికి కారణాలు అనేకం.
- కార్భోహైడ్రేట్స్ చాక్లెట్లలో, స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం, దంతాలను సరిగ్గా శుభ్రపరచకపోవడం. చిన్న పిల్లలు ఎక్కువ చాక్లెట్లు తింటారు. కాబట్టి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చక్కెర పదార్థాలలో ఉండే సుక్రోజ్, ఫ్రక్టోస్ పదార్థాలు దంతాల సందుల్లో చిక్కుకోవడంతో అక్కడ క్రీములు పెరుగుతాయి.
ఇతర పంటి సమస్యలు:
1. ఎగుడు దిగుడు దంతాలు
2. దంతాల మధ్య సందులు
3. దంతాల అరుగుదల, వదులుగా అవ్వడం
4. దంతాల మధ్య పాచి పేరుకోవడం
5. చిగుళ్ళు వాయటం
6. చిగుళ్ళ నుంచి రక్తస్రావం
7. నోటి దుర్వాసన
ఎగుడు దిగుడు దంతాలు, సందులు:
- ఇది చిన్న పిల్లల్లో సహజం కాబట్టి దీన్ని సమస్యగా భావించనక్కర్లేదు.
- 17-18 సం. తర్వాత కూడా పళ్ళు సరైన వరుసలో లేకపోతే అప్పుడు దీన్ని సమస్యగా భావించవచ్చు.
కారణాలు: చిన్న పిల్లలు నోట్లో వేళ్ళు పెట్టుకోవడం సహజం. పిల్లలలో ఈ అలవాటు మానిపించాలి. లేకపోతే శాశ్వత దంతాలు కూడా ఎగుడుదిగుడుగా ఏర్పడతాయి.
- కొంత మందికి నోటి ద్వారా గాలి పీల్చుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల కూడా దంతాలపైన ప్రభావం ఉంటుంది.
- నాలుక కరుచుకునే అలవాటు కూడా మనం తరచూ చూస్తూనే ఉంటాం. దీనిని ''టంగ్ ధ్రస్టింగ్'' అంటారు.
యాసిడ్ పంటిని కరగదీస్తుంది. పుచ్చును ఆంగ్లంలో డెంటిల్ కేరీస్ అంటారు. ఇది ముందు ఎనామిల్ని, తర్వాత డెంటిన్ ఆ తర్తా పల్స్ని దెబ్బతీస్తుంది. కేరీస్ ఎనిమిల్ వరకు ఉన్నప్పుడు ఎటుంవంటి నొప్పి బాధ ఉండదు. డెంటల్లోకి వెళ్లినపుడు సెన్సిటివిటీ కలుగుతుంది. అనగా చల్లఇ నీళ్ళు త్రాగినపుడు పళ్ళు జివ్వుమంటాయి. పురుగు పల్స్కు చేరినపుడు మాత్రం తీవ్రంగా నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఆ నొప్పి తలకి, చెవికి కూడా పాకుతుంది. దాన్ని ''రేడిమిటింగ్ పెయిన్'' అంటారు. కేరీస్ ఎనామిల్ డెంటిన్లో ఉన్నపుడు సిమెంట్ వేస్తే సరిపోతుంది. పల్ప్కు చేరుకున్నపుడు మాత్రం ''రూట్ కెనాల్'' ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్తపడటం మంచిది. చాలామంది నొప్పి కలిగితేగానీ డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళరు. అలా కాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం అవసరం.
పళ్ళ అరుగుదల: వయసు పెరుగుతుండగా పళ్ళలో కూడా పలు మార్పులు కలుగుతాయి. అందులో అన్నింటికన్నా ముఖ్యం దంతాలు అరిగిపోవడం. కొందరిలో యుక్తవయసులోనే ఈ సమస్య చూస్తుంటాం.
కారణాలు:
- ఎక్కువ బలంతో దంతాలు రుద్దడం
- టూత్బ్రష్ బ్రిజిల్స్ గట్టిగా ఉండటం
- ఒకవైపు ఎక్కువ నమలడం
పళ్ళు, గోర్లు కొరికే అలవాటు. దీనిని ''బ్రక్సిసమ్'' అంటారు. ఈ అలవాటు ఉన్నవారు తెలియకుండానే నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. దీనివల్ల కూడా దంతాలు త్వరగా అరిగిపోతాయి.
చిగుళ్ళ సమస్య: చిగుళ్ళ వాపు అనేది మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. చిగుళ్ళ నుంచి రక్తస్రావం కూడా అవుతుంటుంది. వీటికి గల కారణం నోటిని శుభ్రంగా ఉంచకపోవడం. అంతేకాదు కొన్ని మందుల వలన కూడా చిగుళ్ళ వాపు వస్తుంది. అందులో ఒకటి 'నిఫిడిపిన్'. పంటికి పెట్టిన సిమెంట్ చిగురుకు తగులుతూ ఉంటే కూడా వాస్తుంది. పళ్ళను సరిగా శుభ్రపరచకపోతే గార పడుతుంది. అది పళ్ళసందుల్లో చిగురు సందుల్లో ఇరుక్కొని వాపుకు కారణం అవుతుంది. దీని వల్ల దుర్వాసన కూడా వస్తుంది. పళ్ళు పచ్చగా మారతాయి. ఇవి ప్రాథమికంగా తలెత్తే సమస్యలు. మీ దంతాలను పరీక్షించుకోండి. అందంగా ఉండండి.
Authorization