అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణం రక్తహీనత. శరీరంలోని ప్రతికణానికి రక్తం అవసరం. రక్తం తక్కువగా ఉండడాన్ని వైద్య భాషలో రక్తహీనత, ఎనీమియా అంటారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, రక్తం ఉత్పత్తిలో లోపాలు వంటిని రక్తహీనతకు కారణం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత కారణంగా అనేక సమస్యలు వస్తుంటాయి. ఎమరుపాటుగా ఉంటే అనేక జబ్బులకు కారణం అవుతుంది.
మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసక త్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ప్రతి 100 గ్రాముల రక్తంలో మగవారిలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నారని గుర్తించాలి.
రక్తహీనతకు (ఎనీమియా) గురైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్త కణాలు (రెడ్బ్లడ్సెల్స్- ఆర్ బిసి- లేదా ఎరిత్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. రక్త పరీక్షలో ఆర్బిసి కౌంట్ ద్వారా రోగి రక్తంలో ఎన్ని ఎర్రరక్తకణాలున్నాయనే విష యాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య 38 శాతం నుంచి 48 శాతం వరకూ ఉంటుంది. ఆర్బిసి లో ఆక్సిజన్ను తీసుకునివెళ్లే హీమో గ్లోబిన్ ఉంటుంది.
ఆరోగ్యవంతుల్లో హీమోగ్లోబిన్ ఒక డెసి లీటర్కు 12 గ్రాములుంచి 16 గ్రాముల మధ్య ఉంటుంది. ఆర్బిసి కౌంట్ ఒక మైక్రోలీటర్కు 4.4నుంచి 5.8 మిలియన్ల వరకూ ఉంటుంది. ఆర్బిసిలోని హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకువెళుతుంది. ఆక్సిజన్ రవాణా వ్యవస్థగా ఎర్ర కణాలు ఉపకరిస్తాయి. ఆక్సిజన్ శరీరానికి ఇంధనంగా ఉపయోగపడుతుంది.
రక్తహీనతకు గురైన వ్యక్తిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్త కణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు.
శరీరంలో ఉండే ఎరిత్రోప్రోటీన్ అనే హార్మోన్ బోన్ మారోను ఉత్తేజపరిచి, ఎర్ర రక్తకణాల సంఖ్యను నియంత్రించేలా చేస్తుంది. శరీరంలో ఉండే దాదాపు మొత్తం ఎరిత్రోప్రోటీన్ను మూత్రపిండాలు ఉత్పత్తి చేస్తాయి. అక్కడినుంచి ఎరిత్రోప్రోటీన్ బోన్మారోకు చేరుతుంది. ఇక్కడే ఎర్ర రక్తకణాలు తయారవుతాయి. ఒక వ్యక్తి మూత్రపిండాల వ్యాధికి గురైన ప్పుడు మూత్రపిండాలు అవసరమైన స్థాయిలో ఎరిత్రోప్రోటీన్ను ఉత్పత్తి చేయలేవు. ఎరిత్రోప్రోటీన్ లేకుండా, బోన్మారో తగి నంత సంఖ్యలో ఎర్ర రక్తకణాలను తయారు చేయలేవు. ఫలితంగా శరీరావసరాలకు సరిపో యేంత ఆక్సిజన్ అందదు.
మహిళల్లో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత, రక్తం తక్కువగా ఉండడం. రక్తహీనత ముఖ్యంగా మూడు కారణాల వలన వస్తుంది.
పౌష్టికాహార లోపం
శరీర పోషణకు కావల్సిన ఆహారం తీసుకోకపోవడంతో రక్తహీనత వస్తుంది. ముఖ్యంగా ఐరన్ కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో రక్తహీనత సమస్య రాదు.
రక్తం నష్టపోవడం
మహిళలు రుతుస్రావం ద్వారా ప్రతినెల అధికంగా రక్తన్ని కోల్పోయినా.. పిల్లలు కడుపులో నట్టల వల్ల, మలంలో రక్తం పడటం వల్ల రక్తహీనతకు లోనవుతారు.
రక్తం ఉత్పత్తి తగినంత లేకపోవడం..
కొన్నిరకాల జబ్బుల వలన ముఖ్యంగా మలేరియా వలన రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అవుతాయి. తిరిగి అవి పెరగకపోవడం, రక్త కణాల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన రక్తహీనత వస్తుంది.
రక్తహీనత లక్షణాలు
- నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం
- అలసట, చికాకు,
- ఆకలి లేకపోవడం, కళ్ళు తిరగడం
- అరచేతుల్లో చెమట, చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం
- పాదాలలో నీరు చేరడం
-న చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.
ఎవరిలో ఎక్కువగా ...
గర్భిణీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. మగవారిలో కూడా రక్తహీనత చోటుచేసుకుంటుంది.
కలిగే దుష్పరిణామాలు
బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మొదలైనవి.
చికిత్సా విధానం
ఇది ప్రత్యేకించి జబ్బు కాదు. సరైన ఆహారం తీసుకుంటే చాలావరకు సమస్య కలుతుంది.
న చిన్న పిల్లలకు కడుపులో నట్టలు పోయే మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో
శుభ్రంగా కడుక్కునేలా అలవాటు చేయాలి.
- ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి.
నటీనెజ్ అమ్మాయిల నుంచి బిడ్డకు జన్మనించే మహిళల వరకు అందరికీ ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.
నివారణ..
రక్తహీనతను నివారించడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక ప్రజారోగ్య కార్యక్రమాన్ని చేపట్టింది. రక్తహీనతకు తేలికగా గురికాగల గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఉపకేంద్రం ద్వారా ఇనుమున్న ఎర్రగోలీలు (ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు) ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఈ గోలీలను గర్భిణీలయితే 6వ నెల మొదటి నుండి 100 రోజుల పాటు, బాలింతలు చనుబాలు ఇస్తున్నంత కాలం లేదా 100 రోజుల పాటు, 11 సం. వయసులోపున్న రక్తహీనతగల పిల్లలు సంవత్సరంలో కనీసం 100 రోజులపాటు క్రమం తప్పకుండా రోజుకొక్కగోలీ చొప్పున తీసుకోవడం వల్ల వారి శరీరానికి పూర్తి రక్తపుష్టి చేకూరుతుంది.
ఈ మాత్రలు తీసుకొనేవారి మలం నల్లబడడం, వికారం కల్గడం సహజం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు.
ఆకుకూరలు రక్తహీనత నివారణకు సులభమైన ఉపాయం.ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. ఇవేగాక ఖరీదైన ఎండినపండ్లు, అంటే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూర్, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు, రోజూ తీసుకొనే ఆహారంలో మొలకెత్తిన పప్పుధాన్యాలు విటమిన్ సి ఎక్కువగా వుండి నిమ్మ, ఉసిరి, జామ లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.
విటమిన్ బి12 తప్పనిసరి..!
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్రూట్, టమోటాలలోనూ.... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది...
రక్తహీనతను అశ్రద్ధ చేయకండి. అది నీరసానికి బలహీనతకు మాత్రమే దారితీయదు. ప్రాణాహానిని కూడా కల్గించవచ్చు.
Authorization