ఈ కాలంలో అందానికి మెరుగులు దిద్దటానికి ఎన్నో రసాయనాలు అందుబాటులో ఉంటున్నాయి. కాని వాటి వల్ల ప్రయోజనాల కన్న హానియే ఎక్కువగా కలుగుతుంది. అవి కేవలం తాత్కాలికంగానే అందంగా కనిపించ్చేలా చేస్తాయి. బ్యూటీపార్లర్కి వెళ్లకుండా ఇంట్లో మనం రోజూ వాడుకునే పండ్లు, కూరగాయాలతో ప్రకాశవంతమైన ముఖం మన సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం...
మనం రోజువారి తీసుకునే ఆహారంలో ఆలుగడ్డ ఒకటి. ఇది ఆరోగ్యంతో పాటు అందం పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందంటున్నారు నిపుణులు. ఆలు తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుంటుంది.
ఆలు కాస్మోటిక్స్ కంటే ఉత్తమంగా ఉపయోగపడుతుందంటు న్నారు? మరి అలాంటప్పుడు ఆలును చర్మ రక్షణకు ఎందుకు ఉపయోగించకూడదు. నేచురల్గా లభించే ఏ ఆహారపదార్థమైనా సరే చర్మానికి హాని కలిగించవు. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆలును డైట్లో చేర్చుకోవడంతో పాటు, చర్మ రక్షణకు కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. అలాగే జుట్టుకు కూడా ఉత్తమంగా ఉపయోగడపడుతుంది.
ఆలులో ఉండే విటమిన్ బి, సిలు, స్ట్రార్చ్ కూడా చర్మ రంగును కాంతివంతంగా మార్చుతాయి. కండ్ల క్రింది చర్మంను కాపాడి, నల్లటి వలయాలను నివారిస్తాయి. కంటి చుట్టూ ఏర్పడే నల్లటి మచ్చలకు ఆలు రసాన్ని పట్టిస్తే మంచి ఫలితముంటుంది. ఆలును స్లైసుగా కోసి తరచూ మొహానికి అప్లై చేస్తుంటే చర్మపు ముడతలు తగ్గుతాయి. మరి ఆలుగడ్డ ఏవిధంగా బ్యూటీ ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం....
నేచురల్ బ్లీచ్: చర్మం నల్లగా, కమిలినట్లు అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, ఆలు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ముడతలు పోయేలా: ఆలురసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి ఆలు రసాన్ని రాస్తే మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. ఆలు గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి మాస్క్లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడుతలతో పాటు ఏజింగ్ లక్షణాలు కూడా తొలగిపోతాయి.
చక్కని ఛాయకి : ఆలుని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం మిక్స్ చేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేస్తుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే ఆలు రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. దీన్ని ఫేస్ మాస్క్ లా అప్లై చేయాలి .
డార్క్ సర్కిల్స్, కండ్ల్ల మెరుపు: ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కండ్లే. అయితే కండ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కండ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. ఆలుని ముక్కలుగా చేసి జ్యూసర్లో వేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వల యాలు తగ్గు తాయి. పొటాటోను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి కంటి చుట్టూ అప్లై చేయాలి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా ఎఫెక్టివ్గా తొలగిపోతాయి.
స్కిన్ స్పాట్స్: చర్మంలో అక్కడక్కడా కనిపించే స్పాట్స్కు ఆలుతో చెక్ పెట్టవచ్చు. ఆలు పేస్ట్ను ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా దీన్ని 25 రోజుల పాటు ట్రై చేస్తే ఫలితం మీరే పసిగడుతారు.
టోనర్గా: మీరు నేచురల్ టోనర్ కోసం చూస్తుంటే ఇది గ్రేట్గా హెల్ప్ అవుతుంది. ఆలుపేస్ట్లో కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల టోనర్గా పనిచేస్తుంది.
షైనీహెయిర్: ఆలు రసానికి కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు ఆరోగ్యవంత మవడంతో పాటు మెరుస్తాయి. అలాగే ఆలుతొక్క తొలగించి నీటిలో నానబెట్టి, ఆ నీటితో తలస్నానం చేసుకుంటే జుట్టుకు మంచి మెరుపును అందిస్తుంది.
సన్బర్న్ నివారిస్తుంది: ఆలు చర్మ మీద గాయాలను, చర్మ సమస్యలను మాయం చేస్తుంది. ఇది సన్బర్న్ను కూడా నివారిస్తుంది. ఆలును స్లైస్గా కట్ చేసి సింపుల్ గా ముఖం మీద అప్లై చేసి మర్ధన చేయాలి. కొద్ది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఫేస్మాస్క్లు: ఒక స్పూను ఆలు రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే ఆలుని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.
పొడి చర్మాన్ని నివారిస్తుంది
పొడి చర్మం ఉన్నవాళ్ళు తురిమిన ఆలుగుజ్జు, అరచెంచా పెరుగు కలిపి దానిని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా మారుతుంది.
Authorization