న్నునొప్పి సమస్యతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చోవలసి రావడం, దూరప్రయాణాలు చేయడం ఇందుకు ముఖ్యకారణం. వెన్నునొప్పి మెడ కింది భాగంనుంచి ప్రారంభమై తుంటి ఎముక వరకు నొప్పి వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకుంటే నొప్పిని పూర్తిగా నివారించవచ్చు.. లేకపోతే కొన్నిసార్లు వెన్ను సర్జరీకి దారితీస్తుంది. కారణాలు : సాధారణంగా వెన్నునొప్పి ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో బరువులు ఎత్తే పనులు చేసేవారిలో వస్తుంది. ఎక్కువ సేపు కూర్చొని పనులు చేసేవారిలోనూ వచ్చే అవకాశము ఎక్కువగా వుంది. కండరాలు, కండరాల జాయింట్స్కు ఎక్కువ శ్రమ కలిగినప్పుడు నొప్పి వస్తుంది. కంప్యూటరు ముందు కూర్చొని ఎక్కువ పని చేయడం సరైన భంగిమలో కూర్చొకపోవడం వల్ల కూడా రావచ్చును. అకస్మాత్తుగా ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల రావచ్చును. వెన్నెముకకు దెబ్బతగలడం, కండరాలు, ఎముక చిట్లడం, విరగడం జరిగినప్పుడు కూడా వెన్నునొప్పి వస్తుంది. చికిత్స.. వెన్నెముకకు దెబ్బతగలడం వల్ల నొప్పి వస్తే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బతగిలిన భాగాన్ని అటుఇటు కదలించడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. అత్యవసరంగా డాక్టరు సలహా తీసుకోవాలి. వాపు ఉంటే ఐస్తో కాపడం పెట్టాలి. చాలామంది ఆయిల్తో మర్దన చేస్తుంటారు. ఇది సరికాదు.