అజీర్ణ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువ మంది ఎసిడిటీ మాత్రలు తీసుకొంటూంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన అజీర్తిసమస్య, కడుపులోమంట, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం మాట ఎలాఉన్నా, దీర్ఘకాలంలో కిడ్నీలమీద తీవ్రప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ మాత్రలు వాడుతున్న సుమారు మూడు లక్షల మంది మీద దీర్ఘకాలం పరిశోధన నిర్వహించారు. వీరిలో ఎసిడిటి సమస్య తగ్గుముఖం పట్టకపోగా, వీరి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినడానికి పరిశోధకులు గుర్తించారు. డాక్టర్లు సూచించిన మేరకు ఈ మందులు వాడుతున్న దుష్ప్రభావాలు మాత్రం తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఎసిడిటీ, అజీర్తి తదితర సమస్యల నుంచి తప్పించుకోవడానికి మందుల కన్నా సహజపద్ధతులు అవలంభించడం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.