ఎండకాలం మొదలైంది. ఎండలు బాబోరు ఎండలు అని చాలామంది భయపడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొన్ని రకాల జీవక్రియలు చక్కగా సాగిపోవాలంటే సూర్య కిరణాలు మన శరీరాన్ని తాకాలి. సూర్యశక్తి మనలోని ప్రతీ కణానికి అందాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ డీ సరిపడా ఉత్పత్తి అయితేనే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
సూర్య కిరణాల కారణంగా మన శరీరంలో హార్మోన్ల పరంగా కొన్ని మార్పులు జరుగుతాయి. సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. మనం హ్యాపీగా ఉండేందుకు ఈ హార్మోన్ ఎంతో కీలకం. చీకటి పడితే మెదడుకు సంకేతాలు పంపుతుంది. దాంతో మెదడు మెలటోనిన్ అనే హర్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ నిద్ర సంకేతాలను ఇవ్వడంతో ప్రశాంతంగా నిద్ర పోతారు. తగినంత సూర్యరశ్మి పొందకుంటే మన శరీరంలో సెరటోనిన్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో ప్రవర్తనలో మార్పులు, డిప్రెషన్, ఒత్తిడి, త్వరగా అలసిపోవడం వంటి ఎన్నో సమస్యలు కనిపిస్తాయి.
శిశువులకు సంజీవని
అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను పరీక్షించగా వారిలో విటమిన్ డీ తక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. మరో అధ్యయనం ప్రకారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరే ప్రతీ ఐదుగురు శిశువుల్లో ఇద్దరు విటమిన్ డీ లోపం కారణంగానేనని వెల్లడైంది. సెప్టిక్ షాక్ (రక్తపోటు గణనీయంగా పడిపోవడం) తో ఆస్పత్రిలో చేరే చిన్నారుల్లోనూ ఉండాల్సిన దానికంటే తక్కువగా విటమిన్ డీ ఉన్నట్టు గుర్తించారు. అందుకే శిశువులకు విటమిన్ డీ డ్రాప్స్ ను సూచిస్తుంటారు. శిశువులకు వచ్చే జాండిస్ సమస్య నివారణకు, రికెట్స్ వ్యాధి నివారణకు సూర్యుని కిరణాలు అవసరం.
శిశువుల్లో కామెర్లు తగ్గకుంటే సూర్యరశ్మి నే ఉపయోగిస్తారు. దీన్నే ఫొటోథెరపీ అని కూడా అంటారు. ఈ కాంతి మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి సెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఒత్తిళ్లు, మానసిక పరమైన చిరాకు పోగొట్టుకోవాలంటే రోజూ ఎండలో నిర్ణీత సమయం పాటు ఉండడం చాలా అవసరం.
ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట సూర్యుని కిరణాలు నేరుగా వంటిపై పడేలా చూసుకుంటే 90 శాతం వ్యాధులు నశిస్తాయి. ఎండలో కూర్చునే ముందుగా చర్మానికి కొబ్బరి నూనె రాసుకుంటే సూర్యుని కిరణాలు మన శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి.
కేన్సర్ వస్తుందా...?
ఎండలోకి వెళితే కేన్సర్ వస్తుందనేది అపోహేనని, సూర్యరశ్మి కేన్సర్ నివారిణి అని వైద్యపరిశోధకులు చెప్తున్నారు. ఎండ కారణంగా కేన్సర్ సోకినట్టు ఇప్పటి వరకూ ఎక్కడా నిర్ధారణ కాలేదు. సూర్యరశ్మి లోపిస్తే కొలన్ కేన్సర్, హాడ్కిన్స్ లింఫోమా, ఒవేరియన్ కేన్సర్, పాంక్రియాటిక్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు వుందని సర్వేల ద్వారా వెల్లడైంది. అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో ప్రకారం 57 రాష్ట్రాల్లో 37 రాష్ట్రాల్లో సూర్యరశ్మి తగినంత లభిస్తుంది. అక్కడ కేన్సర్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యరశ్మి తక్కువగా ఉండే మరో 20 రాష్ట్రాల్లో కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. కనుక సూర్యరశ్మి వల్ల కేన్సర్ నయమవుతుందే కానీ, సూర్యుని కిరణాలతో కేన్సర్ వ్యాధి రాదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.
రోజులో 15 నిమిషాల పాటు ఉదయం, సాయంత్రం సూర్యుని కిరణాలు చర్మంపై, శరీరంపై పడేలా చూసుకుంటే తగినంత విటమిన్ డీ తయారవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చెప్తుంది. సోరియాసిస్, ఎక్జెమా, జాండిస్, యాక్నేలకు సూర్యకిరణాలు చర్మంపై పడేలా చూసుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే సూర్యరశ్మి తాగేలా చూసుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
Authorization