మనం నిత్యం తీసుకునే ఆహారంలోనే ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా రకాల అనారోగ్యసమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నవారికి రోజు పొద్దున్నే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇస్తే టైప్ 2 డయాబెటిస్ను కంట్రోల్ చేయవచ్చని తెలిసింది. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైంది. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ను మన శరీరం విటమిన్ ఎ కింద మార్చుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దీనితో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రోజు పొద్దున్నే క్యారెట్ జ్యూస్ తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే క్యారెట్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి షుగర్ ను పెంచవని, అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. పరగడుపునే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే టైప్ 2 డయాబెటిస్ను అదుపులో ఉంచవచ్చు. మరెందుకు ఆలస్యం..మార్కెట్ నుంచి తాజా క్యారెట్లు తీసుకువచ్చి జ్యూస్ తాగండి. టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నవారికే కాదు అందరికీ ఆరోగ్యకరమైనది క్యారెట్.