పండ్లరసాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. పండ్లలో వివిధరకాల ఔషధ గుణాలు, విటమిన్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ స్వచ్ఛమైన పండ్లరసాలలో మాత్రమే ఉంటాయి. ప్యాక్ చేసి నిల్వ చేసిన పండ్లరసాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ శాతం చాలా తక్కువ. ఈ పాక్ చేసి నిల్వచేసి ఉన్న పండ్ల రసాలలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. ఇవి అధిక బరువును పెంచుతాయి. నెమ్మదిగా ఇతర రోగాలకు, అనగా మధుమేహం, కిడ్నీ సమస్యలు రక్త పోటు వంటి సమస్యలకు కూడా కారణమవుతాయి. వీటిలో పోషకాలు పరిమాణం తక్కువగా, ఇతర రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. తాజా పండ్ల రసాల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. పిల్లలకు ఎండాకాలంలో తాజాగా పండ్లరసాలు చేసి ఇస్తే వారిని డీహ్రైడేషన్ సమస్య నుంచి రక్షించడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు అందించవచ్చు.