ఎండాకాలం వచ్చిందంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. నీటి కాలుష్యంతో కొన్నిరకాల సమస్యలు వస్తే సూక్ష్మజీవుల వ్యాప్తి కారణంగా మరికొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిలో అందరినీ వేధించేది, అతి సాధారణమైంది చికెన్పాక్స్. ఇది అంటువ్యాధి. వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధినే ఆటలమ్మ అని కూడా పిలుస్తారు.
చికెన్ పాక్స్ ఒక విధమైన చర్మవ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధి. చికెన్ పాక్స్ సోకిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలి ద్వారా ఎదుటి వారిలో ప్రవేశిస్తుంది. వ్యాధి సోకిన వారిని ఆరోగ్యంగా వున్నవారు తాకినా ఈ వ్యాధి వస్తుంది. ఇంట్లో ఒకరికీ వస్తే మిగతా వారికి కూడా వస్తుంది. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. అరుదుగా కొందిరిలో ఈ వ్యాధి న్యుమోనియా, మెదడు వాపు వంటి అనారోగ్య సమస్యలకి కారణమయ్యే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధికి కారణమయ్యే వైరస్ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా పిలుస్తారు. వైద్యసదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు. కారణం ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు. చికెన్ఫాక్స్ తగ్గిన తర్వాత వారి చర్మంపై మచ్చలు అలాగే ఉండిపోయేవి.
ఈ వ్యాధి సోకిన వారికి చర్మం దురదగా ఉండటమే కాకుండా ఎర్రగా కందిపోతుంది. తొలుత ముఖంపై ప్రారంభమైన ఈ దురద మెల్లగా వీపు, నడుము భాగాలకు కూడా వ్యాపించి చర్మం మొత్తం చిన్న చిన్న ఎర్ర కురుపులుగా మారతాయి. వ్యాధి తీవ్రత పెరిగిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు.
కారణాలు..
వాతావరణంలో వేడి, మురికివాడల్లో అపరిశుభ్రత కారణంగా వైరస్ వ్యాప్తిస్తుంది. చిన్నపిల్లలు, టీనేజ్ వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. పెద్దవారిలో వచ్చే ప్రమాదం ఉంది.
లక్షణాలు
- చర్మంపై లక్షణాలు కనపడక ముందే కొన్నిరకాల అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అందరిలో ఒకేవిధమైన లక్షణాలు కనిపించినా.. పిల్లల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
- రెండు రోజుల ముందు నుంచే దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసం, ఆకలిలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ముఖం, వీపు, ఛాతీ భాగములో దురదతో కూడిన ఎర్రని రాష్ కనిపిస్తుంది.
- రాష్ రెండురోజుల్లో నీటితో కూడిన బొబ్బలుగా మారుతుంది.
జాగ్రత్తలు
తాత్కాలికంగా వేధించే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. తుమ్మినా, దగ్గినా నోటికి కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలి.
- చర్మం దురదగా అనిపిస్తుంది. వీలైనంతవరకు దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు,.
రాత్రివేళ నిద్రలో దద్దుర్లను గీర కుండా చేతులకు శుభ్రమైన గుడ్డకాని, గ్లౌజులు వేసుకోవాలి.
- వీలైనంతవరకు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మంపై దురద కాస్త తగ్గుతుంది.
- కాలమిన్ లోషన్ చర్మంపై అప్లై చేస్తే దురదను కాస్త తగ్గుతుంది.
- జ్వరం, దగ్గు ఎక్కువగా ఉంటే డాక్టరును సంప్రదించాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
- తేలికగా జీర్ణమయ్యే అహార పదార్దాలు, ద్రవపదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి.
- పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
- చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. ప్రతిరోజు - శుభ్రమైన దుస్తులు వాడాలి.
- వ్యాధి సోకిన వారు వాడినబట్టలను వేడినీళ్లతో ఉతకాలి. డెటాల్ వేసి ఉతకాలి.
నివారణ
చికెన్ పాక్స్ (varicella)ను నివారించే టీకాలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం డోసులు వేయించుకోవాలి. ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రాంతాలలో ముఖ్యంగా మురికివాడల్లో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని, తీవ్రతను అదుపు చేయవచ్చు. ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాలి.
మచ్చలను నివారించేలా..
చికెన్పాక్స్ కారణంగా చర్మంపై వచ్చే మచ్చలు నివారించడానికి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించవచ్చు. అంతేకాదు వీటి ద్వారా రాషెస్ వల్ల వచ్చే దురద తగ్గుతుంది.
తేనెను నేరుగా దద్దులపై అప్లై చేయాలి. ఇది దురదను తగ్గించడంతో పాటు మచ్చలు రాకుండా నివారిస్తుంది.
- చర్మం మీద ఏర్పడ్డ ఎర్రని మచ్చలపై బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల ఉపశమనం ఉంటుంది. త్వరగా దద్దుర్లను మాన్పుతుంది. దురదను కూడా తగ్గిస్తుంది.
- యాంటీ వైరన్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న వేపను వాడితే మంచి ఫలితం ఉంటుంది. వేపాకును పేస్ట్ చేసి శరీరం మొత్తం అప్లై చేసి ఆరిన తర్వాత స్నానం చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల దద్దుర్లను డ్రైగా మార్చి తర్వాతగా తగ్గిపోయేందుకు వేప ఉపయోగపడుతుంది. వేపా వేసిన నీటితో స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
- వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలోనే ఈ వ్యాధి వస్తుంది. చికెన్ పాక్స్ ను నివారించాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచు కోవాలి. ఇందుకోసం ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, విటమిన్ సి అధికంగా ఉండే తాజా పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- ప్రతిరోజూ నారింజ, కివి పండ్లు తీసుకోవటం వల్ల విటమిన్ సి, శరీరానికి కావల్సిన అతి ముఖ్య పోషకాలు లభింస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కివి లో ఉంటే ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తాయి. తీసుకున్న ఆహారం జీర్ణం కావడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
Authorization