కిడ్నీ జబ్బులు మనదేశంలో ఎక్కువ. ఇందుకు అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలే కీలకం. వీటిని గుర్తించడంలో ఆలస్యం అవుతుండడం వల్ల ఈ లోపే కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా ఈ సమస్యలకు లక్షణాలేవీ కనిపించవు. కాబట్టి మందులు వాడిన తర్వాత తేడా ఏమీ కనిపించకపోవడంతో చాలామంది సక్రమంగా మందులను వేసుకోరు. జబ్బు తగ్గిపోయిందని మరికొంతమంది మందులు ఆపేస్తుంటారు. దాంతో జబ్బులు మళ్లీ మొదటికి వస్తాయి. కిడ్నీల పనితీరుపై ప్రభావం పడటంతో దెబ్బతింటాయి. డయాలసిస్ తప్పనిసరి అవుతుంది. అలా కాకుండా కిడ్నీలను కాపాడుకోవాలన్న, డయాలసిన్ సమయంలో జాగ్త్రతలు తప్పనిసరి..
ఐదోదశ వచ్చే వరకు అంటే కిడ్నీ 15శాతం కన్నా ఎక్కువ పనిచేయలేని స్థితికి వచ్చేవరకు కిడ్నీలో వ్యాధి ఉందనే లక్షణాలు ఏవీ కనిపించవు. ఆ తర్వాత కాళ్లవాపు, ఆయాసం, మూత్రం రాకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి చివరిదశలో ఉన్నదాన్ని మళ్లీ నార్మల్ చేయలేం. అందువల్ల ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడమే దీనికి పరిష్కారం.
బీపీ, షుగర్ లాంటి జబ్బులున్నవాళ్లు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. మూత్రపరీక్షలు, క్రియాటినిన్ పరీక్షలకు ఖర్చు కూడా తక్కువే. వీటి ద్వారా కిడ్నీలు దెబ్బతిన్నాయా లేదా అనేది తెలుస్తుంది. మూత్రంలో ప్రొటీన్ కన్పిస్తే అప్రమత్తం కావాలి. క్రియాటినిన్ నార్మల్గా ఉన్నా ప్రొటీన్ ఉండే కిడ్నీలు దెబ్బతింటూ ఉన్నట్టే. అందుకే క్రియాటినిన్తో పాటు ప్రొటీన్ టెస్టు చేయించుకోవాలి. ముందే డాక్టర్ని కలిస్తే మందులతో కంట్రోల్ చేయవచ్చు. ప్రొటీన్, బీపీ, షుగర్లను నియంత్రించవచ్చు. వ్యాధి మరింత పెరిగి, కిడ్నీలు మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. కానీ, కిడ్నీల డాక్టర్ను కలిస్తే డయాలిసిస్ అంటారనే భయంతోనే చాలామంది డాక్టర్ వద్దకు వెళ్లడానికి భయపడతారు. కానీ, ప్రారంభంలోనే వస్తే డయాలిసిస్ అవసరాన్ని తప్పించవచ్చు. లేదా వాయిదా వేయవచ్చు. ఐదేండ్ల్లకే డయాలిసిస్ అవసరమయ్యే దశను పదేండ్ల వరకు డయాలిసిస్ అవసరం రాకుండా చేయవచ్చు. డయాలిసిస్ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని నివారించడానికి చకవైన పరీక్షలు చాలు. ముందే చికిత్స మొదలుపెట్టడం వలÊ వ్యాధి వేగంగా పెరగకుండా నిరోధించవచ్చు. అక్యూట్ దశలో ఉన్న కిడ్నీ జబ్బు అయితే రివర్స్ చేయవచ్చు. అంటే బీపీ, షుగర్ లేకుండా ఇన్ఫెక్షన్లు, డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన నొప్పి లాంటి వాటి వల్ల హఠాత్తుగా కిడ్నీ పనితీరు దెబ్బతింటే స్వల్పకాలిక ప్రభావం ఉంటే రివర్స్ చేయవచ్చు.
కిడ్నీలు విఫలమైతే..
కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. రసాయనాలు, ఇతర హానికారకపదార్థాలు, ద్రవాలన్నీ ఈ వడపోత ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఏ కారణం చేతనైనా కిడ్నీలు చేసే ఈ ఫిల్టర్ మెకానిజమ్ ఆగిపోతే టాక్సిన్స్, అదనపు ద్రవం అంతా పేరుకు పోతాయి. అదనంగా చేరిన ఈ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం వస్తుంది. అదనపు ద్రవం వల్ల కాళ్లవాపు, ముఖం వాపు కనిపిస్తాయి. పొట్టలో నీరు చేరుతుంది. బీపీ పెరిగిపోయి, రక్తపోటు అదుపు తప్పుతుంది. ఆకలి ఉండదు. పొద్దున్నే వాంతులు, వికారం ఉంటాయి. కిడ్నీలు దెబ్బతినడం వల్ల విటమిన్ డి, ఎరిత్రోపాయిటివ్ హార్మోన్లు లోపిస్తాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకల నొప్పులు, ఫ్రాక్చర్లు కావడం, ఎముకల సాంద్రత తగ్గిపోవడం జరుగుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తికి దోహదపడే ఎరిత్రోపాయిటివ్ లోపం వల్ల రక్తహీనత, తద్వారా నీరసంగా ఉంటారు. శక్తి ఉండదు. రక్తనాళాల సమస్యలు వస్తాయి. సమస్య మూడు, నాలుగు దశల్లో ఉన్నప్పుడే హఠాత్తుగా గుండె సమస్యతో చనిపోతారు. పదేండ్ల ఆయుష్ తగ్గిపోతుంది. కిడ్నీలో సమస్య ఉందంటే గుండె పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. వీరిలో పదిశాతం ఎక్కువ రిస్త్ ఉంటుంది. కిడ్నీ జబ్బు ఉంటే బీపీ పెరుగుతుంది. బీపీ ఉంటే కిడ్నీ జబ్బు వస్తుంది. ఈ రెండింటికి ఒకదానితో మరొకటి ప్రభావం కలిసి ఉంటాయి.
డయాలసిస్ చేయించుకోవడం వల్ల..
డయాలసిస్ అనగానే చాలామంది భయపడతారు. ఈ భయం వల్ల కూడా డాక్టర్ దగ్గరికి రాదు. నిజానికి డయాలసిస్ చేయించుకోకుండా కిడ్నీ జబ్బును తగ్గించుకోవడం సాధ్యం కాదు. డయాలసిస్ చేయించుకోకపోతే కిడ్నీ జబ్బు పెరిగి శరీరంలోని అనిన భాగాలు డ్యామేజ్ కావచ్చు. డయాలసిస్ అంటారేమోనని కిడ్నీ సమస్య ఉన్నా డాక్టర్ దగ్గరకు రావడానికి చాలామంది భయపడతారు. ఆలస్యం చేస్తే సమస్య మరింత పెరుగుతుంది.
కిడ్నీ సమస్యతో పాటు రక్తహీనత ఉంటే గుండెజబ్బు వస్తుంది. . అయితే డయాలసిస్ అనేది సహజమైన ప్రక్రియ కాదు. కాబట్టి సైడ్ ఎఫెక్టులుంటాయి. చాలా తక్కువ మందిలోనే ఇవి కనిపిస్తాయి. డయాలసిస్ వల్ల ద్రవాలు సడెన్గా షిఫ్ట్ కావడం వల్ల బీపీ తగ్గడం, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. అలాగని కిడ్నీ జబ్బు ముదిరిపోయి డయాలసిస్ చేయించుకోకుంటే మాత్రం ప్రాణానికే ప్రమాదం.
ఎంతకాలం..
సాధారణంగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేస్తారు. మూత్ర విసర్ణన నార్మల్గా ఉంటే డయాలసిస్ తక్కువ సార్లు చేస్తారు.
డయాలసిస్ చేసేటప్పుడు..
ద్రవ పదార్థాలు తక్కువ తీసుకోవాలి. రోజుకి ఒక లీటరు ద్రవం మాత్రమే తీసుకోవాలి. ఇది పాలు, పండ్లరసాలు రూపంలోనే కాదు అన్నం, కూరగాయల రూపంలో తీసుకున్నా కూడా లెక్కలోకి వస్తుంది.
బీపీ, గుండె షుగర్ మందులు రెగ్యులర్గా వేసుకోవాలి.
ఉప్పు రోజుకు రెండు గ్రాములకు మించకూడదు.
కొందరికి పొటాషియం రెసిస్టెన్స్ ఉంటుంది. వారు డాక్టర్ సలహామేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
కొందరు అన్నిరకాల వంటకాలు, కూరగాయలతో సహా తీసుకోకుండా కేవలం పెరుగన్న తింటుంటారు. ఇది సరికాదు. నిజానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. శరీర బరువు ఎన్ని కిలోలుంటే అన్ని గ్రాముల ప్రొటీన్ అనేది తప్పక తీసుకోవాలి.
డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత ఉంటే డాక్టర్ సలహా మేరకు ఎరిత్రోపాయిటిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
కండరాలు, ఎముకల కోసం వ్యాయామం చేయాలి. యోగా, వాకింగ్, జిమ్ లాంటివేదైనా తప్పక చేయాలి.
Authorization