మనదేశంలో ఆర్థికంగా ముందున్న రాష్ట్రాలలో మధుమేహ మహమ్మారి ఎక్కువగా ఉంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు సైతం మధుమేహం విస్తరించడం ఆందోళనకరమైన అంశం. గ్రామీణ ప్రాంతాలలో మధుమేహం పట్ల అవగాహన ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. రంజాన్ సమయంలో ఉపవాస దీక్ష చేయాలని భావించే మధుమేహ రోగులు తమ ఉపవాస దీక్షలు ప్రారంభించడానికి కనీసం ఒకటి లేదా రెండు నెలల ముందుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ మధుమేహ నియంత్రణ స్ధాయి తెలుసుకోవడంతో పాటుగా మధుమేహం కారణంగా ఎదురయ్యే తీవ్రమైన సమస్యలను తెలుసుకోని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మధుమేహం ఉన్నవారు ఉపవాసం కారణంగా ప్రమాదాల బారిన పడుతుండటం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఐడీఎఫ్ డయాబెటీస్ అట్లాస్ 2017 విడుదల చేసిన గణాంకాలు మధుమేహ తీవ్రత గురించి హెచ్చరిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం 'మధుమేహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది సెకన్లకూ ఒకరు చనిపోతున్నారు.
అంతర్జాతీయంగా 451 మిలియన్ల మంది మధుమేహులు ఉంటే వారిలో 72.9 మిలియన్ల మంది భారతదేశంలో ఉన్నారు'. ఐడీఎఫ్ డయాబెటీస్ అట్లాస్ 2017 ప్రకారం, 693 మిలియన్ల మంది ప్రజలు మధుమేహ ప్రభావం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉపవాస దీక్ష 12 గంటలకు పైగా ఉంటే, అప్పటికప్పుడు సంభవించే గ్లైకోజెన్ క్షీణత వల్ల ఇబ్బంది ఎదురుకావొచ్చు.
ఉపవాస దీక్షలోని చాలా మంది రోగులు సాయంత్రం వరకూ దీక్షను కొనసాగించి భోజనం తీసుకోవడం వల్ల వారిలో మధ్యాహ్న సమయానికే గ్లైకోజెన్ క్షీణత కనిపిస్తుంది. ఈ స్థితిలో కీటోజెన్సిస్ ఏర్పడవచ్చు. ఒకవేళ భోజనం చేయడం మానేస్తే, అది మరింతగా గ్లైకోజెన్ నిల్వలు క్షీణించడానికి కారణమవుతాయి. టైప్ 2 మధుమేహులలో చూస్తే చాలామంది స్ఠూలకాయంతో ఇబ్బంది పడతారు. రోగి బరువు పెరిగిన కొద్దీ సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఉపవాసంతో మధుమేహ రోగులు బరువు తగ్గడంతో పాటుగా రక్తంలోని చక్కెర నియంత్రించుకోవడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. అయితే, డాక్టర్ను సంపద్రించకుండా ఉపవాసం ఎట్టి పరిస్థితులలోనూ చేయరాదు. డాక్టర్ను 6 నుంచి 8 వారాల ముందుగా సంప్రదించి ప్రణాళిక చేసుకోవడం ద్వారా రోగి శరీర స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉపవాస సమయంలో ఎదురయ్యే సమస్యలను గురించి అంచనా వేయడం సాధ్యమవుతుంది. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆరోగ్యకరమైన అవకాశాలను ఎంచుకోవడం అవసరం. గ్లూకోమీటర్తో ఇంటిలో రెగ్యులర్గా చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవడం, రక్తంలో చక్కెర స్థాయి అధికం కావడం లేదా తగ్గడం గుర్తించడమనేవి ఉపవాస సమయంలో అత్యంత కీలకమైన అంశాలు.
తీసుకోవాల్సిన ఆహారం
- సమతుల్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- 45 - 50శాతం కార్బోహైడ్రేట్
- 20 -30 శాతం ప్రొటీన్
- 35శాతం కన్నా తక్కువగా కొవ్వు (మోనో మరియు పాలీ అన్శాచురేటెడ్కు ప్రాధాన్యత)
- అతి తక్కువ గ్లిసెమిక్ ఇండెక్స్, అత్యధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని జోడించాలి. ఇవి
- ఉపవాసంకు ముందు, తరువాత నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి
ఉదాహరణ: బీన్స్, రైస్ , గోధుమ బ్రెడ్ లాంటివి
- ఎక్కువగా పళ్లు, కూరగాయలు, సలాడ్స్ జోడించాలి
- శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి
ఉదాహరణ: నెయ్యి, సమోసా, పకోరా లాంటివి
- వంట సమయంలో తక్కువ నూనె వినియోగించాలి
ఉదాహరణ : ఆలీవ్, రాప్సీడ్ లాంటివి
- చక్కెర అధికంగా ఉండే తీపిపదార్థాలు తీసుకోరాదు
- సూర్యోదయం, సూర్యాస్తమయం తరువాత మంచినీళ్లు తాగడం లేదా ఇతర చక్కెర లేని పానీయాలను తీసుకోవడం ద్వారా నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి
- కేఫిన్ లేదా చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోవద్దు.
జాగ్రత్తలు :-
- ఉపవాస దీక్షకు ముందు, చేస్తున్న సమయంలో, తరువాత మీ డాక్టర్ను సంప్రదించాలి
- మీ డైట్లో అత్యధిక మోతాదులో పీచు పదార్థం ఉన్న ఆహారం జోడించాలి
- ఎక్కువ మొత్తంలో మంచినీరు తాగాలి. చక్కెర లేని పానీయాలను ఉపవాస దీక్ష ముగిసిన సమయంలో తీసుకోవాలి
- ప్రతిరోజూ మీ రక్తంలోని చక్కెర స్థాయిలను పర్యవేక్షించాలి. మరీ ముఖ్యంగా మీరు ఇన్సులిన్ తీసుకునే వారైతే !
- మీ భోజనంలో అధిక మోతాదు లో పళ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
- మీ రక్తంలో చక్కెర నిల్వలు తగ్గడం లేదా పెరగడానికి సంబంధించి ఎలాంటి సూచనలైనా సరే నిర్లక్ష్యం చేయరాదు. తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి
- మీ రక్తంలో చక్కెర స్థాయి 70మిల్లీగ్రామ్/డీఎల్ కన్నా తక్కువ లేదా 300 మిల్లీగ్రామ్/డీఎల్ కన్నా ఎక్కువగా చక్కెర స్థాయి ఉంటే ఉపవాసం కొనసాగించడం సూచనీయం కాదు.
- వేయించిన ఆహారం, స్వీట్లు మరియు కాఫీలను వీలైనంతగా తీసుకోరాదు.
- అధికంగా వ్యాయామాలు చేయడం మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో వాటిని చేయడం శ్రేయస్కరం కాదు.
- ఎలాంటి సందర్భంలో అయినా సరే, డాక్టర్ను సంప్రదించ కుండా మందులు తీసుకోవడం ఆపడం చేయరాదు.
అవగాహన తప్పనిసరి..
మధుమేహం ఉన్నవారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గ్లైకోమా, రక్తపోటు, లిపిడ్స్ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఉపవాసం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను సైతం అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలి. రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో మధుమేహ రోగులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గురించి అవగాహనను పెంచాలి. . ఆరోగ్యసంరక్షణ నిపుణులకు నిర్మాణాత్మకంగా రోగులకు అవగాహన కార్యక్రమాలను అందించేలా శిక్షణ అందించాలి. ఉపవాసం, మధుమేహం గురించి మరింతగా తెలుసుకోవడం ద్వారా ఆరోగ్య కరమైన పద్దతిలో ఉపవాసం చేయడానికి ఉన్న అవకాశాలపై అవగాహన తప్పనిసరి.
Authorization