పొద్దున్నే టిఫిన్ తయారు చేసే టైమ్ లేనివాళ్లు, హడావుడిగా ఆఫీస్లకు పరిగెత్తేవాళ్లుబ్రేక్ఫాస్ట్గా రెండు బ్రెడ్డు ముక్కలు తినడం చూస్తుంటాం. స్నాక్స్గానూ శాండ్విచ్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి ఆధునికశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతో, మానసిక సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, పాస్తా, నూడుల్స్ లాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపించడానికి కారణం గ్లూటెన్. ఇది కొందరిలో మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందని వివరిస్తున్నారు. గ్లూటెన్ ఉన్న వాటిని తిన్న తర్వాత తాజా పండ్లు తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.