వయసు పెరిగే కొద్ది వచ్చే అనారోగ్యసమస్యల్లో అల్జీమర్స్ ఒకటి. ఈ సమస్య రాకుండా నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు జీవితకాలాన్ని పెంచే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల క్రమంలో కొత్తవిషయాలు శాస్త్రవేత్తలు కనుకొన్నారు. వీరి పరిశోధనల ప్రకారం భవిష్యత్తులో వ ద్ధాప్యం చాలా లేట్గా వచ్చేలా చేయవచ్చని అంటున్నారు. అంటే ఇప్పుడు 60ఏండ్లకు వచ్చే సమస్యలు భవిష్యత్లో 80ఏండ్లకు రావచ్చు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. పేగులోని బ్యాక్టీరియాతో తయారుచేసే ఔషధంతో వృద్ధాప్య ప్రక్రియకు చెక్ పెట్టవచ్చవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్స్ వ్యాధిరాకుండా నివారించవచ్చని అంటున్నారు. పేగులో ఉండే సీ.ఎలగాన్స్ అనే బ్యాక్టీరియాపై వారు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుకొన్నారు. దానిలోని జన్యువులు, సమ్మేళనాలు రోగాలను అడ్డుకుని జీవిత కాలాన్ని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఈ బ్యాక్టీరియాపై మరిన్ని రకాల పరీక్షలు నిర్వహించి జీవితకాలాన్ని పెంచే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు.