ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే కారణాలలో క్యాన్సర్ అనేది రెండవ ప్రధాన కారణమని తేలింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది దాదాపు 96లక్షల మంది కేవలం క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. క్యాన్సర్ బారిన పడేందుకు అనారోగ్యకర లైఫ్ స్టైల్ అనేది ముఖ్యకారణంగా చెప్పవచ్చు. స్మోకింగ్, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, శుభ్రతను పాటించకపోవటం, మద్యపానం, జెనెటిక్స్ వంటివి క్యాన్సర్ సమస్య ఎదురవడానికి గల మరికొన్ని కారణాలు. ఇంట్లో, బెడ్ రూమ్లో ఉండే వస్తువుల్లో క్యాన్సర్ కారకమైనవని ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. - పెయింట్స్లో క్యాన్సర్ కి దారితీసే అస్థిర కర్బన సమ్మేళనాలు కలిగి ఉంటాయి. జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లోని అంశాల ప్రకారం ఎక్కువగా పెయింట్స్ వాడటం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. - చక్కని పరిమళం గదంతా ఆక్రమించడానికి బెడ్ రూమ్ లో, ఆఫీస్ల్లో స్ప్రే చేసే ఎయిర్ఫ్రెష్నర్స్ కారణంగా కూడా క్యాన్సర్ వస్తుంది. వీటికి బదులు ప్రకృతి సిద్ధంగా లభించే నిమ్మ, ఆరెంజ్, పుదీనా, తులసి, మల్లె, గులాబీ, సంపెంగలను వాడటం మంచిది. - పోలైవినిల్ క్లోరైడ్ (పీవీసి) అనే ప్లాస్టిక్ పాలిమర్ ను ఉపయోగించి తయారుచేసే సింథెటిక్ లెదర్లో ప్రమాదకరమైన ఎన్నో కెమికల్స్ ను వినియోగిస్తారు. వీటిలో టాక్సిక్ కెమికల్స్ క్యాన్సర్ కారకాలుగా ఉండాయి. ఫర్నీచర్ ను కొనుగోలు చేసేటప్పుడు సింథటిక్ లెథర్ తో తయారయ్యే వాటిని ప్రిఫర్ చేయవద్దు. కలప ఫర్నీచర్ కు ప్రాధాన్యత ఇస్చే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. - కాటన్ పిల్లోస్ వాడటం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కార్సినోజెనెసిస్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ప్రకారం పత్తి సాగులో ఉపయోగించే క్రిమిసంహారకాలు, స్ప్రేచేసే హెర్బిసైడ్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. - నిద్రించే సమయంలోనూ సెల్ ఫోన్స్, ఎలెక్ట్రానిక్ డివైస్లను దగ్గరగా ఉంచుకోవడం సాధారణ అలవాటుగా మారిపోయింది. ఈ డివైసెస్ నుండి విడుదలయ్యే ఎలెక్ట్రోమ్యాగెటిక్ రేడియేషన్స్ కారణంగా క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిద్రించే సమయంలో ఈ డివైసెస్ ను ఆఫ్ చేయాలి.