ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా ఇంకా దాహంగా అనిపిస్తుంది. నీరసం, అలసట, ఒత్తిడి, కండ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే రోజూ 200మిల్లీలీటర్ల కొబ్బరినీళ్లు తాగాలి. ఎందుకంటే వీటిలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఎండాకాలంలో ఎంతో ఆరోగ్యకరం. ప్రతిరోజు తాగడం వల్ల శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ష నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తి సామర్థ్యాలను పెంచడంలో కొబ్బరి నీళ్లు మంచి మెడిసిన్లా పని చేస్తాయి. శరీరం డీహైడ్రేట్ అయితే తల నొప్పిగా ఉంటుంది. ఆ సమయంలో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ చేయబడుతుంది. ష కొబ్బరి నీళ్లల్లో కార్బోహైడ్రేట్స్, సోడియం, పొటాషియం, ఫైబర్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఫైబర్ అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. దాంతో పాటు జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది. మూడ్ బాగాలేనప్పుడు కొబ్బరి నీళ్ళను తాగితే మంచి ఫలితం ఉంటుంది. ష కొబ్బరి నీళ్లల్లో సమృద్ధిగా పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండవల్ల కలిగే చికాకును దూరం చేస్తుంది.