ఇటీవల ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బడి పిల్లలు, ఉద్యోగస్తులు టిఫిన్, లంచ్, స్నాక్స్ ప్లాస్టిక్ బాక్సులో తీసుకువెళ్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్యసమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాక్సుల స్థానంలో స్టీల్వి తీసుకువెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ప్లాస్టిక్తో చేసిన రంగురంగుల లంచ్ బాక్సుల వాడకం కారణంగా దీర్ఘకాలంలో అనేక అనారోగ్యసమస్యలు వస్తాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. ఇంట్లో షోషక విలువలతో కూడిన వంట తయారు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం వల్ల ఆహారంలోని పోషకాలన్ని నశిస్తాయి. బయట హౌటళ్ల నుంచి తెప్పించుకునే ఆహారం కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్గా మారే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కవర్లలో సాంబారు, పెరుగు, కూరలు, చెట్నీలు వంటి వాటిని కట్టి ఇస్తుంటారు. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బాక్సుల్లో ్లనిల్వ చేయడం వల్లే బాక్సుకు ఉన్న రంగులు, అందులోని రసాయనాలు ఆహారంలో చేరే అవకాశం ఉంది. పిల్లలకు ప్లాస్టిక్ బాక్స్లకు బదులుగా హాట్బాక్సు, స్టీల్ బాక్సుల్లో అల్పాహారాన్ని, భోజనాన్ని తీసుకెళ్లి ఇవ్వడం ఆరోగ్యకరం. వేడిగా ఉన్న పదార్థాలు చల్లార్చి బాక్సుల్లో నిల్వ ఉంచి పిల్లలకు అందించాలి. నాణ్యమైనవే.. పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను వాడవద్దు. చౌకగా లభించే ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఎక్కువగా అనారోగ్యసమస్యలు వస్తాయి. స్టీల్ లంచ్ బాక్సులైనప్పటికీ వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండా పిల్లలకు లంచ్, టిఫిన్ పెడితే ఆ ఆహారం తినడం వల్ల డయేరియా, వాంతులు వంటి అనారోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గిచండంతో పాటు లంచ్, టిఫిన్ బాక్స్లను రోజూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం తప్పనిసరి.