చాలామంది తమ తీసుకునే ఆహారంలోనే అనేక ఔషధాలున్నాయన్న విషయాన్ని పట్టించుకోరు. ఏదైనా అనారోగ్యసమస్య వస్తే మందులు వేసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే తీసుకునే ఆహారంలో కొద్దిమార్పులు చేసుకుంటే అనారోగ్య సమస్య నుంచి భయపడవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు రోజూ వారి ఆహారంలో రాగులు చేర్చితే చాలావరకు సమస్య తగ్గిపోతుంది. చిరుధాన్యాలన్నింటిలోనూ రాగులు బెస్ట్. వీటిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలన్నిస్తాయి. జావా, సంగటి రూపంలోనే కాకుండా దోశ, ఇడ్లీ, రొట్టె, లడు ఇలా అనేక విధాలుగా తీసుకోవచ్చు. రాగులను ఏ విధంగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడేవారు రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. వీటిలో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకు రాగి జావను పాలతో కలిపి ఇస్తే ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు రాగి జావ తరచుగా తాగితే సమస్య తీరిపోతుంది. వీటిలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల మల బద్దకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు. రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో తోడ్పడతాయి. ఇంకా డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు కూడా రాగులతో వాటికి చెక్ పెట్టవచ్చు.