చాలామంది పల్లీలు, బఠాణీలు వంటి వాటికి పొట్టు తీసి తింటారు. పొట్టు తీయని ధాన్యాలు తింటే నిదానంగా జీర్ణమవుతూ రక్తంలోకి నెమ్మదిగా గ్లూకోజు విడుదల చేస్తాయి. దీంతో మెదడుకు నిరంతర శక్తి అందుతుంది. అందువల్ల దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నల వంటి ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. టమాటాల్లో 'లైకోపేన్' అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్. దీనివల్ల నాడీకణాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. టమాటాలను ఉడికించి తింటే శరీరం లైకోపేన్ను మరింతగా గ్రహిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఎండు పప్పుల్లో (నట్స్) విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి లోపాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు విటమిన్-ఇ ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ ఆకుకూరలు, గింజలు, గుడ్లు, దంపుడు బియ్యం, పొట్టు తీయని ధాన్యాల ద్వారా పొందవచ్చు. పల్లీలు, బఠాణీలు వంటి ధాన్యాలకు పొట్టు తీసి తినడం వల్ల జీర్ణక్రియకు కావల్సిన ఫైబర్ లభించక మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు కాఫీ, కూల్డ్రింకులు, మద్యం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఆహారం ద్వారా తగినంత పీచు లభించేలా చూసుకోవాలి. మెదడుకు సరైన రక్తప్రసరణ జరిగేలా చూసుకోవాలి. మెదడులోని కణాలకు అవసరమైన ఆక్సిజన్ అందేలా యోగసనాలు వేయాలి.