ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి కొంతమేరకు ఫలితాలను ఇస్తున్నాయి. క్యాన్సర్ నియంత్రణ దిశగా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు రక్తపరీక్ష విధానాన్ని రూపొందించడంలో వైద్య శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణ అయిన ప్రతీ ఐదుగురిలో నలుగురు వ్యాధి నిర్ధరణ అయ్యాక ఏడాదిలోగానే మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల ఫలితాలు అందుబాటులోకి వస్తే క్యాన్సర్ మరణాలను చాలా వరకు అరికట్టవచ్చు. రక్తపరీక్ష ద్వారా.. క్యాన్సర్ గుర్తించే రక్తపరీక్షను 'క్యాన్సర్ సీక్' పరీక్షగా పిలుస్తారు. ఇందులో- క్యాన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా 16 జన్యువులకు సంబంధించి ఏర్పడే జన్యు పరివర్తితాలను, రక్తంలో తరచూ విడుదలయ్యే ఎనిమిది ప్రొటీన్లను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. 1,005 మంది క్యాన్సర్ రోగులపై తమ విధానాన్ని నిపుణుల బ ందం పరీక్షించి ఫలితాలను పరిశీలించారు. క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అందించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అండాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమ గ్రంథి, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్లు- ఈ ఎనిమిది క్యాన్సర్లలో ఐదింటిని ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ విధానాలు లేవు. క్లోమ గ్రంథికి వచ్చే క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టం. వ్యాధి లక్షణాలు కొన్నే ఉంటాయి. ఇది బాగా ఆలస్యంగా బయటపడుతుంది. కొనసాగుతున్న ప్రయోగాలు క్యాన్సర్ను గుర్తించేందుకు ఏడాదికి ఒకసారి నిర్వహించే రక్తపరీక్ష విధానాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. శస్త్రచికిత్స చేసి తొలగించగలిగే దశలోనే కణితులను గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. నిపుణుల బ ందం 'క్యాన్సర్ సీక్' విధానాన్ని ప్రస్తుతం క్యాన్సర్ సోకినట్లు నిర్ధరణ కాని వ్యక్తులపై పరీక్షించి చూస్తోంది. రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మామోగ్రామ్, కొలరెక్టల్ క్యాన్సర్ను గుర్తించేందుకు కొలనోస్కోపీ ఉన్నాయి. ఇలాంటి కొన్ని విధానాలకు తోడుగా ఈ రక్తపరీక్షను ఉపయోగించవచ్చు. 'క్యాన్సర్ సీక్' పరీక్ష విధానంలో క్యాన్సర్ కణితులకు చెందిన పరివర్తిత జన్యువులు, ప్రొటీన్ల జాడలు రెండింటినీ పసిగట్టేందుకు ప్రయత్నిస్తారు.