ఎసిడిటీ సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇందుకు కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తాగడం. నిర్జీత సమంలో ఆహారం తీసుకోకపోవటం వలన కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. చాలామంది ఎసిడిటీ సమస్యకు మందులు వేసుకుంటారు. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. మందులతో పనిలేకుండా ఇంట్లోనే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. - కొబ్బరినీళ్లు ఎండాకాలంలోనే తాగాలి అనుకుంటే పొరపాటే. డీహైడ్రేషన్ నుంచి కాపాడే గుణాలున్న కొబ్బరినీళ్లు కడుపులో తయారయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గించడంతోనూ బాగా పనిచేసచ్తుంది. ఎసిడిటీతో బాధపడేవాళ్లు రోజూ ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు తాగితే సమస్య తగ్గుతుంది. - రోజూ పాలను తాగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ తగ్గుతుంది. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాలను పీల్చుకుని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ర తేనె కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా పని చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో చెంచా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. - ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు సమయానికి ఆహారం తీసుకోవాలి. ఏ సీజన్లోనైనా ఎక్కువగా నీళ్లు,, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి. ఈ చిట్కాలు పాటించినా సమస్య తగ్గకపోగా మరి ఎక్కువగా వేధిస్తుంటే డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవాలి.