పొద్దున్న వండిన ఆహారాన్ని తినేటప్పుడు మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. మరికొందరు రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్లో ఉంచి మరుసటి రోజు వేడిచేసుకుని తింటుంటారు. ఒకసారి వండిన ఆహారపదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసుకుని తినడం అనారోగ్యానికి దారితీస్తుందని ఆహారనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పదార్ధాలు అసలు తిరిగి వేడి చేయవద్దని బ్రిటీష్ ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ, యూరోపియన్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ స్పష్టం చేస్తున్నాయి. మనం ప్రతిరోజూ తినే అన్నాన్ని కూడా వేడిచేసి తినకూడదు. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ ప్రకారం అన్నం వేడిగానే తినాలి. గది ఉష్ణోగ్రతలో ఉంటే అందులోకి కొన్నిరకాల విషపదార్థాలు చేరుతాయి. తిరిగి అన్నాన్ని వేడి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకుని వేడివేడిగానే తినాలి. చికెన్ బాగా ఉడికించాలి. లేకపోతే చికెన్లో కొద్దిమొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా అనారోగ్యానికి కారణం అవుతుంది. ఒకసారి వండిన చికెన్ను మళ్లీమళ్లీ ఉడికించడం మంచిది కాదు. ఉడికించిన ఆలుగడ్డలను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల వాటిలో ఒకవిధమైన బ్యాక్టీరియా వ ద్ధి చెందుతుంది. తిరిగి వేడిచేసినా బ్యాక్టీరియా నాశనం కాదు.