తాజావైనా, ఎండువైనా పండ్లు మంచి పోషకాల గనులు. వీటిల్లో పీచు, పొటాషియం, రాగి, ఐరన్, క్యాల్షియం, విటమిన్ల వంటి ఎన్నో పోషకాలుంటాయి. అయితే ఎండు ఫలాల్లో విటమిన్ సి తగ్గుతుంది. నీటి మోతాదు కూడా దాదాపు 80శాతం వరకు తగ్గుతుంది. అందుకే ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాల్లో కేలరీలు, చక్కెర, పీచు ఎక్కువగా ఉంటాయి. తాజా ద్రాక్ష పండ్లలో 1.4 గ్రాముల పీచు ఉంటే.. ఎండుద్రాక్షలో 5.4 గ్రాములు ఉంటుంది. డ్రైఫ్రూట్స్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది.